జనవరి 4న విజయవాడలో 'ఖైదీ నంబర్ 150' ప్రీరిలీజ్ ఫంక్షన్ - రామ్ చరణ్

  • IndiaGlitz, [Saturday,December 24 2016]

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 'ఖైదీనంబ‌ర్ 150' సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టీజ‌ర్లు, మేకింగ్ వీడియో స‌హా 'అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు' ఆడియో సాంగ్‌కి ప్రేక్ష‌కాభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న త‌రుణం రానే వ‌చ్చింది.
జ‌న‌వ‌రి 4న విజ‌య‌వాడలో 'ఖైదీనంబ‌ర్ 150' ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ అభిమానులు, సినీప్ర‌ముఖుల మ‌ధ్య‌ గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది. ఈ విష‌యాన్ని చిత్ర‌నిర్మాత మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అధికారికంగా ప్ర‌క‌టించారు. 2017 మోస్ట్ ఎవైటింగ్ మూవీ 'ఖైదీనంబ‌ర్ 150' కొత్త సంవ‌త్స‌రాన్ని కొత్త‌గా ప్రారంభించ‌బోతున్న సంద‌ర్భంగా చిత్ర‌నిర్మాత చ‌ర‌ణ్ ప్రేక్ష‌కాభిమానుల‌కు క్రిస్మ‌స్, కొత్త సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. నేటి(శ‌నివారం) సాయంత్రం 'ఖైదీనంబ‌ర్ 150' నుంచి 'సుంద‌రి..' సాంగ్ లాంచ్ అయిన‌ సంగ‌తి విదిత‌మే.
కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ నిర్మిస్తున్న‌ ఈ చిత్రానికి వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. ర‌త్న‌వేలు ఛాయాగ్ర‌హ‌ణం, దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు త‌రుణ్ అరోరా విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

More News

చిరు సాంగ్ కు ట్రెమెండెస్ రెస్పాన్స్

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ 150వ చిత్రం `ఖైదీ నంబర్ 150` శరవేగంగా సంక్రాంతి బరిలో రావడానికి సమాయత్తం అవుతుంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్లస్ వన్ ఆడియో విడుదల..!

రోషన్,ఆర్తి హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ప్లస్ వన్.అళహరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి... కాటమరాయుడు ఉగాదికి విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శృతి హాసన్ ల కాంబినేషన్ లో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాత శరత్ మరార్

విశాల్ 25వ సినిమా అదేనట

`ఒక్కడొచ్చాడు` సినిమాతో ఈ డిసెంబర్ 23న ప్రేక్షకులను పలకరించిన విశాల్ ఇప్పుడు వరుసగా మూడు సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. ఒక్కడొచ్చాడు 22వ సినిమా అయితే 23వ సినిమా మిస్కిన్ దర్శకత్వంలో చేస్తున్నాడు.

కాకినాడ ద‌గ్గ‌ర వేలంగిలో సంద‌డి చేసిన ఎన్టీఆర్..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ నిన్న హైద‌రాబాద్ నుంచి రాజ‌మండ్రి వెళ్లి అక్క‌డ నుంచి కాకినాడ ఫ్యామిలీ ఫంక్ష‌న్ లో పాల్గొనేందుకు వెళ్లిన విష‌యం తెలిసిందే. ఈరోజు కాకినాడ ద‌గ్గ‌ర‌లోని వేలంగిలో జ‌రిగిన ఫంక్ష‌న్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు.