యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘కేజీఎఫ్ 2’ టీజర్..

  • IndiaGlitz, [Friday,January 08 2021]

కన్నడలో తెరకెక్కి అనూహ్య విజయం సాధించిన కేజీఎఫ్ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్-2’. మొదటి భాగం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్‌ని షేక్ చేసే కలెక్షన్స్‌తో బ్లాక్ బస్టర్‌ హిట్ కొట్టింది. దీంతో రెండవ భాగంపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. రెండవ పార్ట్ నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా.. ప్రేక్షకులు ఓ రేంజ్‌లో ఫాలో అవుతున్నారు. నిజానికి ఈ సినిమా టీజర్‌ను హీరో యష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విడుదల చేస్తామని ముందుగా ప్రకటించింది. కానీ అనుకున్న రోజు కంటే ఒకరోజు ముందుగానే చిత్ర యూనిట్ వదిలింది. ఈ టీజర్ వేరే లెవల్లో ఉండటంతో యూ ట్యూబ్‌ను షేక్ చేసేస్తోంది.

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర కథకు చాప్టర్-2ను దర్శకుడు ప్రశాంత్ నీల్ యాడ్ చేశారు. కనీసం ఊహలకు కూడా ఈ చాప్టర్ 2 అందకపోవడం విశేషం. నిజానికి ‘బాహుబలి 2’ కథపై బాగానే ఊహాగానాలు సాగాయి. కానీ ‘కేజీఎఫ్ 2’ మాత్రం ఎవరి ఊహాలకు అందడం లేదు. దీంతో సినిమాపై బీభత్సమైన హైప్ క్రియేట్ అయ్యింది. అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో పార్ట్-2 టీజర్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేజీఎఫ్ పార్ట్-2 భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిందని టీజర్‌తో స్పష్టమైంది. టీజర్ చివరలో హీరో యష్ సన్నివేశంతో సినిమా రేంజ్ ఏంటో అర్థమవుతోంది.

తల్లికిచ్చిన మాటకు కట్టుబడిన కొడుకు కథగా పార్ట్-2ను తెరకెక్కించారని టీజర్ చివర్లోని ఓ సన్నివేశం చెప్పకనే చెప్పింది. అధీర ఎలా బతికున్నాడు? అనే ప్రశ్న విపరీతమైన సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తోంది. అధీరా పాత్రలో సంజయ్ దత్, రమీకా సేన్‌గా రవీనా టాండన్ టీజర్‌లో కనిపించారు. రవీనా టాండన్ పాత్రకు కూడా చాలా ప్రాధాన్యముందని టీజర్‌ని బట్టి తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్-2 టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ టీజర్‌‌కు ఇప్పటికే యూ ట్యూబ్‌లో కోటి 60 లక్షల వ్యూస్ వచ్చాయి. మరి 24 గంటలు గడిచేసరికి ఎన్ని వ్యూస్ రాబడుతుందో వేచి చూడాలి.

More News

ప్రియురాలి బెదిరింపుతో వరుడు పరార్... ఆ తర్వాతేం జరిగిందంటే..

‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని.. జరిగేవన్నీ మంచికని.. అనుకోవడమే మనిషి పని’ అన్నాడో కవి.

పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. పవన్ మూడేళ్ల గ్యాప్ తర్వాత చేసిన సినిమా ‘వకీల్‌సాబ్’.

తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజు?

బీజేపీ సీనియర్ నేత, రెబల్ స్టార్ కృష్ణంరాజుకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

జనవరి 10న 'లవ్ స్టోరి' టీజర్ రిలీజ్

ప్లెజంట్ ప్రేమ కథల్ని తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న మరో ఆహ్లాదకర సినిమా ''లవ్ స్టోరి''.

జనవరి 8న 'వలస' విడుదల

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు అనుభవించారు.