KCR:97 నియోజకవర్గాల్లో కేసీఆర్ సుడిగాలి పర్యటనలు.. నేటితో ముగింపు

  • IndiaGlitz, [Tuesday,November 28 2023]

తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టించాలని తహతహలాడుతున్నారు. ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పార్టీ ప్రచారమంతా తన భుజస్కందాలపై వేసుకుని సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అక్టోబర్ 15న మొదలైన కేసీఆర్ ప్రచారపర్వం.. నేటి సాయంత్రంతో ముగియనుంది. ఇప్పటివరకు 97 సభల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌.. ప్రచారం చివరి రోజైన ఇవాళ రెండు సభల్లో పాల్గొననున్నారు. ఇవాళ కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌సభతో ప్రచారం ముగిస్తారు.

కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు..

ముఖ్యంగా తన సభల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కరెంట్‌ కోతలు, రైతుబంధు, ధరణిని ప్రధాన ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే 24గంటల కరెంట్‌ ఉండదని పదే పదే తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందంటున్నారని.. అలాగే టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుబంధు దండగ అన్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. ఇక కాంగ్రెస్‌ వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని అంటున్నారని అదే జరిగితే మళ్లీ దళారుల రాజ్యమే వస్తుందని హెచ్చరించారు. ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ఇచ్చేలా పోరాటం చేశాం..

తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌కు తనదైన శైలిలిలో కౌంటర్లు ఇచ్చారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదని ఇచ్చేలా తాము పోరాడామని గుర్తుచేశారు. 2004లోనే తెలంగాణ ఉచ్చుంటే.. వందలాది మంది బలిదానాలు చేసుకునేవారు కాదని మండిపడ్డారు. 1956లో తెలంగాణలో ఆంధ్రాతో కలిపి తీవ్ర అన్యాయం చేశారని పేర్కొన్నారు. ఇదంతాకాదు కేసీఆర్‌ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేపట్టిన తర్వాత తప్పని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని కేసీఆర్ వెల్లడించారు. ఇలా తన ప్రసంగాల్లో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు.

More News

Election Campaign:సాయంత్రంతో ముగియనున్న ప్రచారం.. ప్రలోభాలపర్వం మొదలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఇవాళ సాయంత్ర 5 గంటల తర్వాత మైకులు మోత బంద్ కానుంది.

Mallareddy:'బిజినెస్‌మ్యాన్' సినిమా చూసే ఎంపీనయ్యా: మంత్రి మల్లారెడ్డి

ఇటీవల తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఏం మాట్లాడినా తెగ వైరల్ అవుతోంది. మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మల్లన్న..

EC Notices:ఇటు బీఆర్ఎస్‌ పార్టీకి.. అటు కర్ణాటక ప్రభుత్వానికి ఈసీ నోటీసులు..

బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే రైతుబంధు నిధుల విడుదల నిలిపివేయాలని ఈసీ ఆదేశించగా..

Bigg Boss Telugu 7 : నమ్మకద్రోహమంటూ ప్రశాంత్ కంటతడి, శివాజీని టార్గెట్ చేసిన హౌస్‌మేట్స్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే..?

బిగ్‌బాస్ 7 తెలుగు తుది అంకానికి చేరుకుంది. మరికొద్దివారాల్లో షో ముగియనుంది. గత వారం డబుల్ ఎలిమినేషన్ ద్వారా రతిక,

Prime Minister Modi:హైదరాబాద్‌లో ముగిసిన ప్రధాని మోదీ రోడ్‌షో.. భారీగా హాజరైన కార్యకర్తలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‭లో ప్రధాని మోదీ నిర్వహించిన భారీ రోడ్ షో ముగిసింది.