పీపీఈ కిట్ లేకుండా గాంధీ ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లిన కేసీఆర్

  • IndiaGlitz, [Wednesday,May 19 2021]

తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. పీపీఈ కిట్ వేసుకోకుండా కేవలం మాస్కు పెట్టుకుని వెళ్లి గాంధీలోని కరోనా రోగులను పరామర్శించారు.

ఏమాత్రం అదురు లేదు బెదురు లేకుండా నేరుగా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న దాదాపు 40 మంది కరోనా రోగులని పలకరించి వారికి మనోదైర్యానిచ్చారు. క‌రోనా రోగుల‌కు ధైర్యం చెప్పడమే కాకుండా.. వైద్యులను కేసీఆర్ అభినందించారు. అనంతరం క‌రోనా రోగుల‌కు అందుతున్న సేవ‌ల‌ను కేసీఆర్ ప‌రిశీలించారు.

ఇదీ చదవండి:  బిడ్డా గంగుల మాడి మసైపోతారు: ఈటల.. వెంట్రుక కూడా పీకలేవు: గంగుల

ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా రోగుల‌కు చికిత్స అందిస్తున్న డాక్ట‌ర్ల‌ను సీఎం కేసీఆర్ అభినందించారు. కొవిడ్ చికిత్స‌తో పాటు ఆక్సిజ‌న్‌, ఔష‌ధాల ల‌భ్య‌త‌ను ప‌రిశీలించి చ‌ర్చించారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హ‌రీష్ రావు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, వైద్యారోగ్య శాఖ అధికారులు ఉన్నారు. సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో గాంధీ ఆస్ప‌త్రి వ‌ద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. గాంధీ ఆస్ప‌త్రి ప్రాంగ‌ణాన్ని మొత్తం శానిటైజ్ చేశారు.

పోలీసులతో పేషెంట్ల బంధువులు వాగ్వాదం..

సీఎం కేసీఆర్ గాంధీ ఆసుపత్రిని సందర్శించడానికి ముందు నుంచే ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు కఠినం చేశారు. ఈ నేపథ్యంలో పేషెంట్ల తాలుకూ సహాయకులను పోలీసులు బయటకు పంపించి వేశారు. ఈ సమయంలో కాసేపు గాంధీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో కరోనా పేషంట్ బంధువులు వాగ్వాదానికి దిగారు. డెడ్ బాడీలను సైతం తీసుకు వెళ్ళేందుకు వెళుతున్న తమను ఆస్పత్రి లోపలికి అనుమతి ఇవ్వడం లేదంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గాంధీ పరిసరాల్లో రెండు కిలో మీటర్ల మేర ఎవ్వరూ రాకుండా ఆంక్షలు విధించారు.

More News

వ్యాక్సిన్‌కు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగానే ఉంది. అయితే వ్యాక్సిన్ కొరత కూడా రాష్ట్రాన్ని వేధిస్తోంది. 18-45 ఏళ్ల మధ్య వయసువారికి వ్యాక్సిన్ అందిస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ టీకా అభివృద్ధికి హైదరాబాదీ కంపెనీ సాయం

కరోనా మహమ్మారిని నిర్మూలించడంలో భాగంగా వ్యాక్సిన్ల తయారీకి తెలంగాణ క్రమంగా గ్లోబల్ హబ్‌గా మారబోతున్నట్టు కనిపిస్తోంది.

'నేనే అందరినీ చంపుతా'.. వామ్మో.. సమంత యాక్షన్ చూశారా!

స్టార్ హీరోయిన్ సమంత నటించిన తొలి వెబ్ సిరీస్ ' ది ఫ్యామిలీ మ్యాన్ 2'. జూన్ 4న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రాబోతోంది.

ఇంటి వద్ద భారీగా భద్రతను పెంచేసిన మహేష్‌.. కారణమేంటంటే..

కరోనా మహమ్మారి దేశంలో ఏ స్థాయిలో విస్తరిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా మహమ్మారి సామాన్యుడు, సెలబ్రిటీ అనే భేదం కూడా చూపడం లేదు.

అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన విజయ్‌కాంత్

ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.