KCR- Rahul Gandhi:కేసీఆర్ ఎత్తులకు కాంగ్రెస్ పైఎత్తులు.. రంగంలోకి రాహుల్ గాంధీ..

  • IndiaGlitz, [Saturday,December 02 2023]

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు అంతా సిద్ధమైంది. ఫలితాలపై ఇటు ప్రజలతో పాటు అన్ని పార్టీల నేతలు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతలు తమదే గెలుపని మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం తెగ టెన్షన్ పడిపోతున్నారు. పూర్తి మెజార్టీ రాకపోతే అభ్యర్థులను ఎలా కాపాడుకోవాలనే దానిపై మేథోమధనాలు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను కాపాడుకోవడానికి ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏకంగా అధిష్టానమే రంగంలోకి దిగింది. ఇందుకోసం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు బాధ్యతలు అప్పగించింది. ఆయన ఇప్పటికే హైదరబాబాద్ చేరుకున్నారు.

మేజిక్ ఫిగర్ రాకపోతే అభ్యర్థులను కేసీఆర్ తన వైపునకు లాక్కొనే ప్రయత్నాలు చేస్తారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌లోని కొందరితో కేసీఆర్ టచ్‌లో ఉన్నారని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ హైకమాండ్ 49 కౌంటింగ్ కేంద్రాల్లో ఏఐసీసీ పరిశీలకులను నియమించింది. మరోవైపు పార్టీ అభ్యర్దులను వెంటనే హైదరాబాద్ రావాలని సూచించింది. నగరంలోని తాజ్‌ కృష్ణ హోటల్‌లో అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో సీనియర్ నేతలు చిదంబరం, సుశీల్‌ కుమార్‌ షిండే, సూర్జేవాలా పాల్గొననున్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వీరు హైదరాబాద్‌లోనే ఉండి కేసీఆర్ వ్యూహాలను నిశితంగా గమనించనున్నారు.

మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ నేతలతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్, ఫలితాలు, గెలిచిన వెంటనే సీఎల్పీ సమావేశం, హంగ్ వస్తే ఎలా ముందుకెళ్లాలనే దానిపై నేతలకు దిశా నిర్దేశంచేశారు. అధికారానికి కావాల్సిన పూర్తి మెజార్టీ వస్తే సరే.. అటు ఇటుగా సీట్లు వస్తే మాత్రం హుటాహుటిన అభ్యర్థులను కర్ణాటకకు తరలించనున్నారు. ఈ మేరకు ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మేజిక్ ఫిగర్ వచ్చి అభ్యర్థులను ఇక్కడే ఉంచుతారా..? అభ్యర్థుల క్యాంప్ తరలింపు ఉంటుందా..? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

More News

Congress:ఈనెల 4న కేబినెట్ భేటీపై సీఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

ఎన్నికల ఫలితాల వేళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదుచేశారు.

Silk Smitha:సిల్క్ స్మిత బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల.. అదిరిపోయిందిగా..

దివంగత నటి సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా మరో బయోపిక్‌ తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆమె జయంతిని పురస్కరించుకుని ‘సిల్క్‌ స్మిత- ది అన్‌టోల్డ్‌ స్టోరీ’

Majority of Seats:మెజార్టీ సీట్లు రాకపోతే ఎలా..? మంతనాల్లో నిమగ్నమైన పార్టీలు..

మరికొద్ది గంటల్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టనుందో రేపటితో తేలిపోనుంది.

Congress:ఇండియా టుడే సర్వేలోనూ కాంగ్రెస్‌కే పట్టం.. సీఎంగా మొగ్గు ఎవరికంటే..?

తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. దీంతో తెలంగాణతో పాటు ఏపీ ప్రజలు కూడా ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు.

Animal:బాక్సాఫీస్‌పై రణ్‌బీర్ వైల్డ్‌నెస్.. దుమ్మురేపిన 'యానిమల్' కలెక్షన్స్..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, దర్శకడు సందీప్ రెడ్డి వంగా కాంబో వచ్చిన 'యానిమల్' మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.