లాక్‌డౌన్ సడలింపుల్లేవ్.. మే-01 తర్వాత ఊరట : కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్-20 నుంచి లాక్ డౌన్‌ సడలింపులు ఉంటాయని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో మాత్రం అలాంటి సడలింపులు ఏమీ ఉండవని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పేశారు. ఆదివారం నాడు సుధీర్ఘ కేబినెట్ భేటీ అనంతరం ప్రగతి భవన్‌లో కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ‘42 దేశాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. మే-03 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది. రేపట్నుంచి కొన్ని సడలింపులు ఉంటాయని కేంద్రం చెప్పింది కానీ.. తెలంగాణలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సడలింపులు ఉండవ్. ఇవాళ నిశితంగా కేబినెట్ భేటీ తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. జాగ్రత్తగా ఉండకపోతే దెబ్బతినే ప్రమాదం ఉంది. గతంలో ఉన్న నిబంధనలే యథాతథంగా అమలులో ఉంటాయి. నిత్యవసరాలు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.

మే-01 నుంచి..

‘మే-01 కరోనా నుంచి తెలంగాణ కోలుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయ్ అని ఆరోగ్య శాఖ మంత్రి, వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవాళ 18 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ్టి కేసులతో కలిపితే మొత్తం 858 కేసులు. ఇందులో 21 మరణాలు సంభవించాయి. 186 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. చికిత్సలో 651 వైద్యం తీసుకుంటున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఎవరి పరిస్థితీ విషమంగా లేదు.. నార్మల్‌గానే ఉంది. వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, భువనగిరి, సిద్ధిపేట ఈ నాలుగు జిల్లాల్లో కరోనా కేసుల్లేవ్. దేశంలో 8 రోజులకోసారి కేసులు రెట్టింపు అవుతున్నాయి. తెలంగాణలో కేసుల సంఖ్య రెట్టింపు అవ్వడానికి 10 రోజులు పెడుతుంది’ అని కేసీఆర్ తెలిపారు.

More News

ఓటీటీలోకి గోవా బ్యూటీ..?

గోవా బ్యూటీ ఇలియానా ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ తీసుకునే హీరోయిన్‌గా క్రేజ్ ఉన్న స‌మ‌యంలోనే టాలీవుడ్‌ను వీడి బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.

రాజ‌మౌళికి ఛాలెంజ్ విసిరిన ద‌ర్శ‌కుడు..

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో దేశం యావ‌త్తు లాక్‌డౌన్‌లో ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. కొత్త వారిని ఇంటికి ర‌ప్పించాలంటే అంద‌రూ ఆలోచ‌నలో ప‌డుతున్నారు.

హైదరాబాద్‌లో మరో పోలీస్‌కు కరోనా.. ఎలా వచ్చింది!?

రోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ విస్తరిస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో జనాలను బయటికి రానివ్వకుండా.. కరోనాపై పోరుల చేస్తున్న వైద్యులు, పోలీసులను సైతం ఈ మహమ్మారి కాటేస్తోంది.!

ఉద్యోగులను తొలగించొద్దు..: కంపెనీలకు కేటీఆర్ విజ్ఙప్తి

ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీల్లోని ఉద్యోగులను తొలగించవద్దని పరిశ్రమ వర్గాలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పారిశ్రామిక వర్గాలకు ప్రత్యేకంగా కేటీఆర్ ప్రత్యేకంగా లేఖ

నూజివీడులో ఇంటింటికీ సరుకులు పంచిన వ్యక్తికి కరోనా

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఊహించని రీతిలో కేసులు పెరిగిపోతున్నాయి. తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా కేసులు సంఖ్య