KCR: చింతమడకలో ఓటు వేసిన సీఎం కేసీఆర్ దంపతులు

  • IndiaGlitz, [Thursday,November 30 2023]

తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు సిద్ధిపేట జిల్లా చింతమడకలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఓటర్లకు అభివాదం చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఈసారి ఎన్నికల్లో కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అటు మంత్రి కేటీఆర్ దంపతులు ఖైరతాబాద్‌లో, మంత్రి హరీశ్ రావు దంపతులు సిద్ధిపేటలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇక మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో 36.68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా ఆదిలాబాద్ - 41.88%, భద్రాద్రి - 39.29, హన్మకొండ 35.29, హైదరాబాద్ 20.79, జగిత్యాల 46.14, జనగామ 44.31, భూపాలపల్లి 49.12, గద్వాల్ 49.29, కామారెడ్డి 40.78, కరీంనగర్ 40.73, ఖమ్మం 42.93, కుమురం భీం 42.77, మహబూబాబాద్ 46.89, మహబూబ్ నగర్ 44.93, మంచిర్యాల 42.74, మెదక్ 50.80, మేడ్చల్ 26.70, ములుగు 45.69, నాగర్ కర్నూల్ 39.58, నల్గొండ 39.20, నారాయణపేట 42.60, నిర్మల్ 41.74, నిజామాబాద్ 39.66, పెద్దపల్లి 44.49, సిరిసిల్ల 39.07, రంగారెడ్డి 29.79, సంగారెడ్డి 42.17, సిద్ధిపేట 44.35, సూర్యాపేట 44.14, వికారాబాద్ 44.85, వనపర్తి 40.40, వరంగల్ 37.25, భువనగిరి 45.07 శాతంగా నమోదయ్యాయని వెల్లడించారు.

మరోవైపు ఆదిలాబాద్ పట్టణంలో విషాదం నెలకొంది. ఓటెయ్యడానికి వచ్చిన ఇద్దరు వృద్ధులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. మావలకు చెందిన తోకల గంగమ్మ (78) ఓటేసేందుకు బూత్ వద్దకు రాగా పిట్స్ వచ్చాయి. ఆస్పత్రికి తరలించే లోపే ఆమె మృతి చెందింది. అలాగే, భుక్తాపూర్ కు చెందిన రాజన్న (65) ఓటేసేందుకు లైన్లో నిలబడి స్పృహ కోల్పోయాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు.

ఇదిలా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సాయంత్రం 5:30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చింది. గతంలో సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్‌కు అనుమతి ఉండగా.. తాజాగా దానిని సవరించింది. దీంతో 5.30గంటలకే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి.

More News

OWK 2nd Tunnel: అవుకు రెండో టన్నెల్ ప్రారంభించిన సీఎం జగన్.. జాతికి అంకితం..

రాయలసీమ ప్రజల చిరకాల వాంఛన నెరవేర్చే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

Revanth Reddy: కుట్రతోనే నాగార్జునసాగర్ ఘటన.. కేసీఆర్ పన్నాగాలు ఫలించవు: రేవంత్

నాగార్జునసాగర్ వద్ద ఏర్పడిన ఉద్రిక్తత ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కొడంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన

ప్రభుత్వంపై పచ్చమీడియా రాతలు.. నవ్విపోదురుగాక ప్రజలు..

పచ్చమీడియా ఎప్పుడూ చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు రాస్తూనే ఉంటుంది. పచ్చ నేతలు మాట్లాడటం ఆలస్యం వాటిని తక్షణమే పచ్చ పత్రికల్లో కొద్దిగా మసాలా కారం

Vote: ఓటు వేయకపోతే జైలు శిక్ష, జరిమానాలు విధిస్తారు తెలుసా..?

మన దేశంలో ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది తప్పనిసరి కాదు. ఎవరి ఇష్ట ప్రకారం వారు ఓటు వేసుకోవచ్చు లేదంటే వేయకుండా ఉండవచ్చు.

Voter Slip: ఓటర్ స్లిప్ లేదా..? ఏం పర్లేదు.. ఇలా చేసి ఓటు వేయండి..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇప్పటికే మొదలైంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పల్లె నుంచి నగరాల వరకు ఓటు వేసేందుకు ఓటర్లు క్యూకడుతున్నారు.