బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప చంప‌లేద‌ట‌..

  • IndiaGlitz, [Wednesday,April 13 2016]

ప్ర‌భాస్ - రాజ‌మౌళి కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ఈ చిత్రం ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రిలో ఒక‌టే సందేహం బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడు..? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కావాలంటే బాహుబ‌లి 2 చూడాల్సిందే అన్నారు.

కానీ...స‌మాధానం చెప్ప‌లేదు బాహుబ‌లి టీమ్. బాహుబ‌లి క‌థా ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఈ ప్ర‌శ్న‌అడిగిన ప్ర‌తిసారీ ఏదో స‌మాధానం చెబుతూ త‌ప్పించుకున్నారు. అయితే..తాజాగా ఓ ఆంగ్ల‌దిన ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా...అస‌లు బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప‌ క‌త్తితో పొడిచినంత మాత్రానా చ‌నిపోయాడ‌ని ఎందుకు అనుకుంటున్నారు అంటూ మ‌రో ట్విస్ట్ ఇచ్చారు. అస‌లు ఏం జ‌రిగిందో పూర్తిగా తెలియాలంటే బాహుబ‌లి 2 వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

హీరోయిన్ కోసం గెస్ట్ గా బాలయ్య...

హీరోయిన్ కోసం గెస్ట్ గా వస్తున్నాడు బాలయ్య.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా..?నిషా కళ్ల త్రిష.గోవి దర్శకత్వంలో త్రిష నటిస్తున్న ద్విభాషా చిత్రం నాయకి.

మహేష్..రైటో రాంగ్గో తేలేది అప్పుడే..

సూపర్ స్టార్ మహేష్...రైటో రాంగ్గో తేలేది అప్పుడే...అనగానే ఎప్పుడు అంటారా..?సూర్య-విక్రమ్ కుమార్ కాంబినేషన్లో రూపొందిన 24మూవీ రిలీజ్ రోజు.

రేపు గోపీచంద్ ఆక్సిజ‌న్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్..

గోపీచంద్ హీరోగా ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆక్సిజ‌న్. ఈ చిత్రాన్ని శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.

ఊపిరి శాటిలైట్ రైట్స్ పై క్లారిటీ ఇచ్చిన పి.వి.పి

టాలీవుడ్ కింగ్ నాగార్జున-కోలీవుడ్ హీరో కార్తీ కాంబినేషన్లో రూపొందిన ఊపిరి చిత్రం మూడవ వారంలోను విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ డేట్ మారింది..

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న చిత్రం బ్రహ్మోత్సవం.