close
Choose your channels

మ‌ణిర‌త్నం మూవీలో కార్తీ క్యారెక్ట‌ర్ ఇదే

Wednesday, March 23, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త‌మిళ హీరో కార్తీ న‌టించిన ఊపిరి చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఈనెల 25న రిలీజ్ అవుతుంది. అలాగే కాష్మోరా అనే చిత్రంలో కూడా కార్తీ న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత కార్తీ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టించనున్నారు. ఈ చిత్రంలో కార్తీ స‌ర‌స‌న ప్రేమ‌మ్ సినిమాలో న‌టించిన సాయి ప‌ల్ల‌వి న‌టించ‌నుంది. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతం అందించ‌నున్నారు.

అయితే ఈ చిత్రంలో కార్తీ పైలెట్ గా ప‌నిచేసే ప్ర‌వాస భార‌తీయుడుగా క‌నిపిస్తార‌ట‌. ఇక హీరోయిన్ విష‌యానికి వ‌స్తే... రియ‌ల్ లైఫ్ లో వైద్యవిద్య‌ను అభ్య‌సిస్తున్న‌క‌థానాయిక సాయి ప‌ల్ల‌వి ఈ చిత్రంలో డాక్ట‌ర్ గా న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. కాష్మోరా సినిమా కోసం కార్తీ గుండు చేయించుకున్నారు. త్వ‌ర‌లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి జూన్ నుంచి కార్తీ మ‌ణిర‌త్నం సినిమాలో న‌టించ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.