ఆకట్టుకుంటున్న కార్తీ, రకుల్ జంట

  • IndiaGlitz, [Saturday,November 11 2017]

ఈ జనరేషన్లో తెలుగులో అభిమానుల సంఖ్యను గణనీయంగా ఏర్పరచుకున్న అతి కొద్ది మంది తమిళ హీరోల్లో కార్తి ఒకరు. మరోవైపు రకుల్ కి తెలుగులో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా 'ఖాకి'. వీరిద్దరు కలిసి నటిస్తున్నారనే వార్త వెలువడినప్పటి నుంచి ఈ కాంబినేషన్ మీద ఆసక్తి మొదలైంది.

ఆ మధ్య విడుదలైన టీజర్ను, ట్రైలర్ను చూసినప్పటి నుంచి సినిమా మీద కూడా అంఛనాలు మరింతగా పెరిగాయి. యంగ్ కపుల్ గా వీరిద్దరు తెరమీద చేయబోయే సందడిని చూడటానికి సినీ ప్రియులందరూ వేచి చూస్తున్నారు.

తెలుుగవారికి తొలిసారి కార్తి పోలీస్ యూనిఫార్మ్ లో కనిపించనున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. భర్తే లోకంగా బతికే మధ్యతరగతి ఇల్లాలి పాత్రలో రకుల్ మెప్పించనున్నారు. ఇప్పటికే విడుదలైన స్టిల్స్ లో, అత్యుత్తమంగా తీర్చిదిద్దిన ట్రైలర్లో వీరిద్దరి మధ్య పండిన కెమిస్ట్రీ కనిపిస్తూనే ఉంది. 'చతురంగ వేట్టై' సినిమాకు దర్శకత్వం వహించిన హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది.

ఆదిత్య మ్యూజిక్ ప్రై లిమిటెడ్ ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ సినిమాను తెలుగులో అందిస్తున్నారు. ఈ నెల 17న తెలుగు, తమిళంలో విడుదల కానున్న 'ఖాకి'లో కార్తి, రకుల్ జంట ప్రేక్షకులకు కన్నులపండువగా మారనుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

More News

సాంగ్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న'దర్పణం'

వి. చిన శ్రీశైలం యాదవ్‌ ఆశీస్సులతో శ్రీ సిద్ధి వినాయక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వి. రామకృష్ణ దర్శకత్వంలో వి. ప్రవీణ్‌ కుమార్‌ యాదవ్‌(వెంకట్‌ యాదవ్‌) నిర్మిస్తున్న చిత్రం 'దర్పణం'.

గ‌రుడ‌వేగ‌కి సూప‌ర్‌స్టార్మ‌ హేష్‌బాబు ప్ర‌శంస‌...

ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ క్యారెక్ట‌ర్స్‌తో మెప్పించిన డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18 ఎం'.

హాలీవుడ్ వెళ్తున్న ప్ర‌భాస్‌

ప్ర‌భాస్ బాడీ లాంగ్వేజ్‌ని స్టంట్ మాస్ట‌ర్స్ స్ట‌డీ చేయాల‌నుకుంటున్నారు. వాళ్ల‌కు అనువుగా ఉండేలా ప్ర‌భాస్ హాలీవుడ్‌కి వెళ్తున్నారు. అదీ ఏకంగా మూడు వారాలు.

'అర్జున్‌రెడ్డి' త‌మిళ టైటిల్ ఏంటో తెలుసా?

ఈ ఏడాది తెలుగులో విడుద‌లైన అర్జున్ రెడ్డి సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన ఈ సినిమా 5 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొంది 50 కోట్లు క‌లెక్ట్ చేసి పెద్ద హిట్ అయ్యింది.

నవంబ‌ర్ 24న 'హేయ్ ..పిల్ల‌గాడ‌'

'ఓకే.. బంగారం' స‌క్సెస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గరైన క‌థానాయ‌కుడు దుల్క‌ర్ స‌ల్మాన్‌. ఇప్పుడు స్ట్ర‌యిట్ తెలుగు మూవీ మ‌హాన‌టిలో సావిత్రి భ‌ర్త జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.