హైదరాబాద్‌కు వచ్చిన కంగన.. సీక్రెట్‌గా ఉంచిన అధికారులు..

  • IndiaGlitz, [Saturday,October 03 2020]

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ హైదరాబాద్‌కు వచ్చారు. 10 రోజుల పాటు రామోజీ ఫిలింసిటీలో జరగనున్న ‘తలైవి’ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు కంగనా హదరాబాద్‌కు చేరుకుంది. కంగనా పర్యటన వివరాలను అధికారులు చాలా సీక్రెట్‌గా ఉంచారు. హైదరాబాద్‌లో ఆమెకు శత్రువులంటూ ఎవరూ లేరు. ఆమెపై అటాక్ జరిగే అవకాశం ఎంత మాత్రమూ లేదు. అయినా గోప్యత మెయిన్‌టైన్ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కంగనకు వై కేటగిరి సెక్యూరిటీని అధికారులు కల్పించారు. మరోవైపు తెలంగాణ అధికారులు కూడా ఆమెకు పూర్తి భద్రతను కల్పించినట్టు సమాచారం.

కంగన ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సుశాంత్ రాజ్‌పుత్ మరణంపై ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి. అప్పటి నుంచి తన అభిప్రాయాలను నిక్కచ్చిగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె మహారాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఆమెకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రతను కల్పించింది. అయితే కంగన ప్రస్తుతం వివాదాలన్నింటిని వదిలేసి సినిమాలపై దృష్టి పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 7 నెలల తరువాత సినిమా షూటింగ్‌కు హాజరవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.