ఆగష్టు 15 న వరుణ్ తేజ్ - క్రిష్ ల కంచె టీజర్ విడుదల

  • IndiaGlitz, [Wednesday,August 12 2015]

మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం 'కంచె '. బాలీవుడ్ లో ఇటివలే గబ్బర్ చిత్రం తో మంచి విజయాన్ని సాధించిన అభిరుచి గల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది. ఈ చిత్రం మొదటి టీజర్ ను ఆగష్టు 15 న స్వాతంత్ర దినోత్సవ సందర్భం గా విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధ పడుతోంది. ఈ విషయాన్నీ తెలుపుతూ, ఈ చిత్రం మొదటి పోస్టర్ ను హీరో వరుణ్ తేజ్ ఈ రోజు తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా విడుదల చేసారు.

ఈ చిత్రం ఆడియో రిలీజ్ డేట్ , మరియి ఇతర వివరాలు త్వరలోనే తెలుపబడతాయి. కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కూడా ఉండొచ్చు, ఉంటాయి. ఈ నేపధ్యం లో, 1940 ల లో సాగే ఒక కథ ను దర్శకుడు క్రిష్ పూర్తి కమర్షియల్ హంగులతో, తన మార్కు విలువలను జోడిస్తూ తెరకెక్కించారు.

భారీ వ్యవయం తో, అత్యుత్తమ సాంకేతిక విలువల తో రూపుదిద్దుకుంటున్నఈ కంచె, తెలుగు సినిమా ప్రతిష్ట ను పెంచే చిత్రం అవుతుంది అనటం లో ఎటువంటి సందేహం లేదు. 'కంచె' చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు . ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు

More News

'సైజ్ జీరో' ఆడియో రిలీజ్ డేట్..

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో’.

'శ్రీమంతుడు' సక్సెస్‌ తో టోటల్ యూనిట్ కి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది - జగపతి బాబు

సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుందని అనుకున్నాం కానీ ఇంత పెద్ద సక్సెస్‌ అవుతుందని అనుకోలేదు.

అతి త్వరలో రానున్న 'క్రిమినల్స్‌'

‘మంత్ర’, ‘మంగళ’ వంటి విభిన్న చిత్రాను రూపొందించి సక్సెస్‌ ఫుల్‌ దర్శకుడుగా తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపు

తెలుగులో '100 డేస్ లవ్'

దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ లు జంటగా , తమిళంలో ఓకే బంగారం(ఓకే కన్మణి) పేరుతో మరో సక్సెస్ కూడా కొట్టారు.

అనువాద సినిమాని విడుదల చేస్తున్నాడు...

నితిన్..ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, అఖిల్ సినిమాతో నిర్మాతగా కూడా పరిచయం అయ్యాడు.