హాస్ప‌ట‌ల్ లో చేరిన‌ క‌మ‌ల్ హాస‌న్

  • IndiaGlitz, [Thursday,July 14 2016]

యూనివ‌ర్శిల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ చెన్నైలోని త‌న ఆఫీస్ మెట్ల మీద నుంచి జారిప‌డ‌డంతో కాలికి గాయం అయ్యింది. దీంతో క‌మ‌ల్ హాస‌న్ చెన్నైలోని అపోలో హాస్ప‌ట‌ల్ లో చేరారు. క‌మ‌ల్ ని ప‌రీక్షించిన వైద్యులు కంగారు ప‌డ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఏమీ లేదు. మూడు వారాలు విశ్రాంతి తీసుకుంటే స‌రిపోతుంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ శ‌భాష్ నాయుడు సినిమాలో న‌టిస్తున్నారు.

ఈ చిత్రంలో క‌మ‌ల్ భార్య‌గా ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుంటే...కూతురుగా శృతిహాస‌న్ న‌టిస్తుంది. ఇటీవ‌లే అమెరికాలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. విచిత్రం ఏమిటంటే....ఈ చిత్రం షూటింగ్ లోఉండ‌గానే ఈ చిత్ర ద‌ర్శ‌కుడు రాజీవ్ కుమార్ అనారోగ్యంతో హాస్ప‌ట‌ల్ లో చేర‌డం జ‌రిగింది. ఇప్పుడు క‌మ‌ల్ కూడా హాస్ప‌ట‌ల్ లో చేరాల్సి వ‌చ్చింది. ఇదిలా ఉంటే... క‌మ‌ల్ కోలుకున్న త‌ర్వాత శ‌భాష్ నాయుడు తాజా షెడ్యూల్ ప్రారంభించ‌నున్నారు. క‌మ‌ల్ త్వ‌ర‌గా కోలుకుని శ‌భాష్ నాయుడు షూటింగ్ లో పాల్గొంటార‌ని ఆశిద్దాం.

More News

మలేషియాకు సూర్య 'ఎస్3'

తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరో సూర్య,కమర్షియల్ డైరెక్టర్ హరి కాంబినేషన్ లో వచ్చిన 'సింగం',

'ఇంకొకడు' ఆడియో, సినిమా రిలీజ్ డేట్

చియాన్ విక్రమ్ హీరోగా నయనతార,నిత్యామీనన్ హీరోయిన్స్ గా థమీన్స్ ఫిలింస్ బ్యానర్స్ పై శిబుథమీన్స్ నిర్మాతగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఇంకొకడు'.

అమితాబ్ ఇంట్లో ప్రకాష్ రాజ్..

అమితాబ్ బచ్చన్ ని ప్రకాష్ రాజ్ ఇంటికి వెళ్లి కలిసారు.

ఆ జ్ఞాప‌కాలు గుర్తుకు వ‌స్తున్నాయంటున్న శ్రియ‌

అందం, అభిన‌యం ఈ రెండూ ఉన్న‌ అతి కొద్ది మంది తార‌ల్లో అందాల తార శ్రియ ఒక‌రు. ఇటీవ‌ల శ్రియ నాగార్జున ఊపిరి చిత్రంలో క‌నిపించి అల‌రించిన విష‌యం తెలిసిందే.

జ‌న‌తా గ్యారేజ్ ఆడియో రిలీజ్ డీటైల్స్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ క్రేజీ మూవీ జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది.