Kamal Haasan:కమల్ హాసన్, మణిరత్నం కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది.. పూనకాలు అంతే..

  • IndiaGlitz, [Monday,November 06 2023]

లోకనాయకుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు మణిరత్నం కలయికలో దాదాపు 36 ఏళ్ల తరువాత ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రేపు(మంగళవారం) కమల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ వీడియోను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకి ‘థగ్ లైఫ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ గ్లింప్స్‌లో ఓ ఫైట్ సీక్వెన్స్ చూపించారు. ఇందులో కమల్ తన పేరు, తానెవరో చెబుతూ ఫైట్ చేస్తాడు. ఇందులో మణిరత్నం టేకింగ్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. ఇక రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ, ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే వేరే లెవల్ అంతే. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ్ హీరో జయం రవి, త్రిష నటించబోతున్నట్లు కూడా ప్రకటించారు.

మణిరత్నం దర్శకత్వంలో కమల్ హీరోగా చివరగా ‘నాయకుడు’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అప్పటినుంచి ఇద్దరి కాంబోలో మరో సినిమా రాకపోవడం గమనార్హం. మూడున్నర దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్లీ కలిసి సినిమా చేయనున్నారనే వార్త సినిమా వర్గాల్లో ఆసక్తి రేపింది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందా? అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌తో మూవీపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశారు.

ఇక కమల్ హాసన్, అగ్ర డైరెక్టర్ శంకర్ కలయికలో తెరకెక్కుతోన్న భారతీయుడు-2 చిత్రం నుంచి ఇటీవల విడులై ఇంట్రో విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇంట్రలో వీడియోలో నమస్తే ఇండియా... భారతీయుడు ఈజ్ బ్యాక్ అంటూ కమల్ చెప్పే హైలెట్‌గా నిలిచింది. మొత్తానికి ఒకటిన్నర నిమిషం ఉన్న ఈ ఇంట్రోలో సినిమా ఎలా ఉండబోతుందనేది చూపించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, బాబీ సింహా, లేట్ వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని, తదితరులు నటించారు.

More News

CM KCR:సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం.. పైలట్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దేవరకద్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా సాంకేతిక సమస్యను

Rashmika:నాలా ఎంతో మంది భయపడుతున్నారు.. డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన రష్మిక..

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తన మార్ఫింగ్‌ వీడియోపై హీరోయిన్ రష్మిక మందన్నా స్పందించారు.

YS Sharmila:సజ్జల రామకృష్ణారెడ్డికి వైఎస్ షర్మిల కౌంటర్.. మీ కథ మీరు చూసుకోండి..

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కౌంటర్ ఇచ్చారు.

శ్రీవారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి

పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. త్రిపుర గవర్నర్ నల్లా ఇంద్రసేనారెడ్డి దర్శించుకున్నారు.

Jagananna Suraksha: అందరికీ రక్షణగా జగనన్న ఆరోగ్య సురక్ష

ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి ఓ లెక్క.. అన్నట్లు సీఎం జగన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రజలందరికీ వైద్య సేవలు అందించాలని