పోస్ట్ ప్రొడక్షన్ లో 'కళ్యాణ వైభోగమే'

  • IndiaGlitz, [Thursday,November 26 2015]

శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై కె . ఎల్ . దామోదర్ ప్రసాద్ ' అలా మొదలైంది' ' అంతకు ముందు ఆ తరువాత ' లాంటి కుటుంబ కధా చిత్రాల తరువాత బి.వి నందిని రెడ్డి దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం " కళ్యాణ వైభోగమే ". నందిని రెడ్డి తన మొదటి చిత్రం ' అలా మొదలైంది ' శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై రూపొందించింది .

ప్రస్తుతం యువతలో ప్రేమ , పెళ్లి లాంటి బంధాల పై ఉన్న అభిప్రాయాలను ప్రతి ఒక్కరికి చక్కగా అర్ధమయ్యేలా కామెడీ , సంగీతం మరియు భావోద్వేగాలను సరైన పాళ్ళలో మేళవించి వాటి విలువలను చాటి చెప్పేలా రూపొందించబడిన కుటుంబ కధా చిత్రం " కళ్యాణ వైభోగమే ". షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా ఉంది . చిత్ర నిర్మాతలు త్వరలో ఆడియో, డిసెంబర్ లో సినిమా ను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత దామోదర్ ప్రసాద్ తెలిపారు.

నాగ శౌర్య , మాళవిక నాయర్ ( ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం ) , పెర్ల్ మానె , రాశి ఐశ్వర్య , ఆనంద్ , రాజ్ మదిరాజ్ , తాగుబోతు రమేష్ , ధనరాజ్ , 'మిర్చి' హేమంత్ , స్నిగ్ధ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : కళ్యాణ్ కోడూరి, సినిమాటోగ్రఫీ : జి . వి . ఎస్ . రాజు, ఎడిటర్ : జునైద్ సిద్దిక్ , కొరియోగ్రఫీ : చిన్ని ప్రకాష్ , రఘు , అని, యాక్షన్ : డ్రాగన్ ప్రకాష్, పాంథర్ నాగరాజు, కాస్ట్యూమ్ డిజైనర్ : శ్రీ , వైశాలి , డైలాగ్స్ & లిరిక్స్ : లక్ష్మీ భూపాల్, కో - ప్రొడ్యూసర్స్ : వివేక్ కూచిభొట్ల , జగన్ మోహన్ రెడ్డి . వి, ప్రొడ్యూసర్ : కె . ఎల్ . దామోదర్ ప్రసాద్, స్టొరీ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : బి వి నందిని రెడ్డి .

More News

తెలుగు, తమిళంలో 'బాజీరావ్ మ‌స్తానీ'

ఈరోస్ ఇంటర్నేష‌న‌ల్‌, సంజ‌య్‌లీలా బ‌న్నాలీ సంయుక్తంగా రూపొందించిన భారీ పీరియాడిక‌ల్ డ్రామా ‘బాజీరావ్ మ‌స్తానీ’. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా డిసెంబర్ 18న సినిమా విడుద‌ల‌వుతుంది. హిందీతో పాటు తెలుగు, త‌మిళంలో కూడా సినిమాను గ్రాండ్ లెవ‌ల్‌లో నిర్మాత‌లు విడుద‌ల చేస్తున్నారు.

ఆంద్రప్రదేశ్ , తెలంగాణా రాష్ట్రాల్లో వందలాది బస్ ల్లో 'బెంగాల్ టైగర్' ప్రమోషన్స్

మాస్ మహరాజ్ రవితేజ,అందాల భామలు తమన్నా,రాశిఖన్నాలు జంటగా,సంపత్ నంది దర్వకత్వంలో,నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించిన చిత్రం బెంగాల్ టైగర్

లచ్చిందేవికి ఓ లెక్కుంది రిలీజ్ డేట్ ఫిక్స్..

అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న తాజా చిత్రం లచ్చిందేవికి ఓ లెక్కుంది.ఈ చిత్రాన్ని దర్శకధీర రాజమౌళి శిష్యుడు జగదీష్ తెరకెక్కించారు.

ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేసే సినిమా 'తను నేను' - హీరో సంతోష్‌ శోభన్‌

అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను సన్‌షైన్‌ సినిమాస్‌ బేనర్‌పై నిర్మించిన అభిరుచిగల నిర్మాత రామ్మోహన్‌ పి.

అవికా అంటే అంతేనా

'ఉయ్యాలా జంపాలా' సినిమా కోసం హీరోయిన్‌గా ట‌ర్న్ అయిన బుల్లి తెర న‌టి అవికా గోర్‌. ఆ త‌రువాత 'ల‌క్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్తా మావ' చిత్రాల్లో న‌టించింది.