'షేర్' ఆడియో అతిథి ఎవరు...?

  • IndiaGlitz, [Tuesday,September 29 2015]

నంద‌మూరి క‌ళ్యాణ్‌ రామ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం షేర్. ఈ చిత్రానికి మ‌ల్లిఖార్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కొమ‌ర వెంక‌టేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం రీరికార్డింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త‌మ‌న్ సంగీతం అందించిన షేర్ ఆడియోను అక్టోబ‌ర్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే షేర్ ఆడియో ఫంక్ష‌న్ కు ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యేది ఎవ‌రో కాదు..యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. క‌ళ్యాణ్‌రామ్‌గారి కెరీర్‌లో షేర్ సెన్సేష‌న‌ల్ సినిమా అవుతుందని.. నంద‌మూరి అభిమానులు పండుగ చేసుకునేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ న‌మ్మ‌కంతో ఉన్నారు.షేర్ చిత్రాన్ని అక్టోబ‌ర్ 30న రిలీజ్ చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు.