బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కాజల్ అగర్వాల్ కన్ఫర్మ్

  • IndiaGlitz, [Tuesday,March 27 2018]

ఇప్పటివరకూ స్టార్ డైరెక్టర్లతో కలిసి సినిమాలు చేస్తూ కథానాయకుడిగా తన స్టార్ డమ్ ను పెంచుకొన్న బెల్లంకొండ శ్రీనివాస్ మొదటిసారిగా ఓ కొత్త దర్శకుడైన శ్రీనివాస్ నిర్దేశకత్వంలో వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం హైద్రాబాద్ లో మొదటి షెడ్యూల్ జరుపుకొంటున్న ఈ చిత్రంలో కథానాయికగా టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను ఫైనల్ చేశారు. ఆల్రెడీ బాలీవుడ్ ఆర్టిస్ట్ నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తుండడం విశేషం.

ఈ సందర్భంగా వంశధార క్రియేషన్స్ అధినేత నవీన్ శొంటీనేని (నాని) మాట్లాడుతూ.. బెల్లంకొండ శ్రీనివాస్ ను సరికొత్తగా ప్రెజంట్ చేయనున్నాం. మంచి థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం శ్రీనివాస్ అద్భుతమైన కథ సిద్ధం చేసుకొన్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఈ చిత్రంలో కథానాయికగా క్రేజీ లేడీ కాజల్ అగర్వాల్ కనువిందు చేయనుంది. నెక్స్ట్ షెడ్యూల్ నుంచి ఆమె షూటింగ్ లో భాగస్వామ్యం కానుంది. అబ్బూరి రవి, ఛోటా కె.నాయుడు, ఎస్.ఎస్.తమన్, ఛోటా కె.ప్రసాద్, స్టన్ శివ లాంటి సీనియర్ & టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కూడా భాగస్వామి అయ్యాడు.  ప్రస్తుతం హైద్రాబాద్ లో మొదటి షెడ్యూల్ జరుగుతోంది అన్నారు.

ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: గణేశుని వెంకటేశ్వర్రావు, కో-డైరెక్టర్: కె.పుల్లారావు, ఫైట్స్: స్టన్ శివ-వెంకట్, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, మాటలు: కేశవ్ పప్పల, ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్, ఆర్ట్: చిన్నా, సంగీతం: తమన్.ఎస్, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, నిర్మాణం: వంశధార క్రియేషన్స్, నిర్మాత: నవీన్ శొంటీనేని (నాని), కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్.

More News

గుమ్మడికాయ కొట్టిన ఆటగాళ్లు !!

సెన్సిబుల్ యాక్టర్ నారా రోహిత్, స్టైలిష్ విలన్ జగపతిబాబు కలిసి నటించిన చిత్రం "ఆటగాళ్లు".

మ‌ల్టీస్టార‌ర్‌లో రామ్ చ‌ర‌ణ్ పాత్ర ఎంటంటే...

ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లం రిలీజ్ టెన్ష‌న్‌తో ఉన్న బ‌ర్త్ డే బాయ్ రామ్‌చ‌ర‌ణ్ తదుప‌రి బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు.

కేసీఆర్ బ‌యోపిక్‌కి రంగం సిద్ధం...

తెలంగాణ రాష్ట్ర సాధ‌కుడుగా.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు పేరు నిలిచిపోయింది.

బాల‌కృష్ణ‌, అల్లు అర్జున్‌ తో..

ఈ ఏడాది 'జై సింహా'తో క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్. ఆ తర్వాత వినాయక్, సాయిధరమ్‌ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఇంటిలిజెంట్' డిజాస్టర్‌గా మిగలడంతో నష్టాలు చవిచూశారు.

తార‌క్‌, త్రివిక్ర‌మ్ చిత్రానికి కంపోజింగ్ మొద‌లైంది

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో