భర్తతో కలిసి ‘ఆచార్య’ సెట్స్‌కి కాజల్.. బొకేతో మెగాస్టార్ స్వాగతం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. వీరిద్దరి కాంబోలో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే మంగళవారం సెట్స్‌లోకి కాజల్ ఎంట్రీ ఇచ్చింది. లాక్‌డౌన్ తర్వాత ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. షూటింగ్‌లో మెగాస్టార్‌తో సన్నివేశాలను కొరటాల తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు.

కథను కీలక మలుపు తిప్పే పాత్రలో చెర్రీ నటిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. చెర్రీ షూటింగ్‌లో పాల్గొనే డేట్స్ కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం. ప్రస్తుతం చెర్రీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ‘ఆచార్య’ కోసం రాజమౌళి పర్మిషన్‌ను కూడా చెర్రీ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే వివాహం.. ఆ తర్వాత హనీమూన్ కారణంగా కాస్త లేట్ అయిన కాజల్.. లేటెస్టుగా తన భర్తతో కలిసి షూటింగ్ స్పాట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో మెగాస్టార్.. నూతన దంపతులను విష్ చేసి.. బొకేలతో స్వాగతం పలికారు. కేక్ కట్ చేయించి నూతను దంపతులను ఖుషీ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అవినీతి ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అవినీతికి వ్యతిరేకంగా చిరు పోరాడే తీరు ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. మొత్తానికి మరో అదిరిపోయే సోషల్ మెసేజ్‌తో కొరటాల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో నిరంజన్ రెడ్డి కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా.. ఈ సినిమాను ఫిబ్రవరి చివరి వారం నాటికి పూర్తి చేసి మార్చిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టి.. ఏప్రిల్ 9న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

More News

బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు 3 ముద్దుగుమ్మలు.. లక్షల్లో రెమ్యునరేషన్..

పెద్దగా అంచనాలేమీ లేకుండా స్టార్ట్ అయినప్పటికీ.. ఇప్పుడు మంచి రేటింగ్స్‌తో బిగ్‌బాస్ రియాలిటీ షో దూసుకుపోతోంది.

‘స‌లార్’లో మ‌రో స్టార్ హీరో.. ఆడిష‌న్స్ షురూ అయ్యాయి

ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌లో విజ‌య్ క‌ర‌గందూర్ ‘సలార్’ అనే ప్యాన్ ఇండియా మూవీని నిర్మించనున్న సంగతి తెలిసిందే.

రజినీకాంత్ పార్టీ పేరు, గుర్తు ఖ‌రారు

త‌లైవా.. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ డిసెంబ‌ర్ 31న త‌న రాజ‌కీయ పార్టీ పేరుని అనౌన్స్ చేసి జ‌న‌వ‌రిలో పార్టీని ప్రారంభిస్తాన‌ని ఇప్ప‌టికే అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

రాజ‌మౌళి ఏంటి ఇలా చేశాడు.. టెన్ష‌న్‌లో మెగా ఫ్యాన్స్‌?

మెగాఫ్యాన్స్ నిరాశ‌లో ఉన్నారా! అంటే అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తుంది. ఇంత‌కీ మెగా ఫ్యాన్స్ టెన్ష‌న్‌కు కార‌ణం ఎవ‌రు?

బీజేపీలోకి తెలంగాణ మంత్రి తమ్ముడు..!?

తెలంగాణలో టీఆర్ఎస్‌కు పెద్ద షాకులే తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.