పెళ్లి తేదీ చెప్పేసిన కాజల్ అగర్వాల్

  • IndiaGlitz, [Tuesday,October 06 2020]

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ముంబైకి చెందిన బిజినెస్‌మేన్‌ గౌతమ్‌ కిచ్లుని పెళ్లి చేసుకోనుందంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ వార్తలకు చెక్‌ పెడుతూ స్వయంగా కాజల్‌ అగర్వాల్‌ తన పెళ్లికి సంబంధించిన ప్రకటన చేసింది. అంతే కాకుండా పెళ్లి తర్వాత తన కెరీర్‌కు సంబంధించిన విషయాన్ని కూడా కాజల్‌ తెలియజేశారు. ఈ రెండు విషయాలకు సంబంధించిన అధికారిక ప్రకటననను కాజల్‌ తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసింది.

ముంబైలో అక్టోబర్‌ 30న గౌతమ్‌ కిచ్లుని పెళ్లి చేసుకోబోతున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. సన్నిహితులైన బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ ఫంక్షన్‌ జరగనుంది. ఈ కోవిడ్‌ సమయం మన జీవితంలో సంతోషాలపై పెద్ద ప్రభావాన్ని చూపింది. అయితే ఈ పాండమిక్‌ సమయంలో మేం మా జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. దీనికి మీ అందరి ఆశీస్సులుంటాయని భావిస్తున్నాను. ఇన్నేళ్లు మీరు నాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు. నేను ఏదైతే బాగా ఇష్టపడ్డానో దాన్ని తిరిగి కంటిన్యూ చేస్తాను. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తాను. మీ సహకారాన్ని అందిస్తారని భావిస్తున్నాను అన్నారు కాజల్‌.  యువ హీరోలతో పాటు సీనియర్‌ హీరోలైన చిరంజీవి, కమల్‌హాసన్‌ వంటి వారితో నటిస్తున్న కాజల్‌.పెళ్లి తర్వాత కూడా నటిస్తానని తెలిపారు.

pic.twitter.com/3qjCX9hAe1

— Kajal Aggarwal (@MsKajalAggarwal) October 6, 2020

More News

తారక్‌ ఫ్యాన్స్‌కి 'ఆర్‌ఆర్‌ఆర్‌' ట్రీట్‌ రెడీ

దర్శకుధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)‌’.

అన్‌లాక్ 5 నిబంధనల్ని నోటిఫై చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

కేంద్ర హోంశాఖ జారీ చేసిన కోవిడ్19 అన్‌లాక్ 5 నిబంధనల్ని నోటిఫై చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సొంత మినీ యాప్‌ స్టోర్‌ను ప్రారంభించిన పేటీఎం..

గూగుల్ ప్లే స్టోర్ నుంచి కొన్ని గంటలపాటు తొలగించిన యాప్.. అది జరిగిన కొద్ది రోజులకే సొంతంగా యాప్ స్టోర్‌ను ప్రారంభించి అందరి దృష్టినీ ఆకష్టించింది.

‘సోలో లైఫే సో బెటర్’ అంటూనే గుడ్ బై చెప్పబోతున్నాడుగా..

మెగా హీరో సాయి తేజ్ అప్ కమింగ్ మూవీ ‘సోలో లైఫే సో బెటర్’. అయితే సాయి తేజ్ సోలో లైఫే సో బెటర్ అంటూనే సోలో లైఫ్‌కి గుడ్ బై చెప్పబోతున్నాడు.

దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు గగనమేనా..?

దుబ్బాక అభ్యర్థుల విషయంలో ఉత్కంఠకు ఇప్పుడిప్పుడే తెరపడుతోంది. తాజాగా టీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా రామలింగారెడ్డి భార్య సుజాత పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు.