సర్దుకుపోతున్న కాజల్

  • IndiaGlitz, [Wednesday,November 18 2015]

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ప్ర‌స్తుతం రెండు తెలుగు సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వాటిలో ఒక‌టి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో మొద‌టిసారిగా జోడీక‌డుతున్న 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్' కాగా.. మ‌రొక‌టి సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబుతో 'బిజినెస్‌మేన్' వంటి హిట్ చిత్రం త‌రువాత రెండోసారి జ‌త‌క‌డుతున్న'బ్ర‌హ్మోత్స‌వం'.

ఈ రెండు సినిమాలు కూడా స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా విడుద‌ల కానున్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ కాజ‌ల్ సోలో హీరోయిన్ కాదు. 'స‌ర్దార్‌'లో రాయ్ ల‌క్ష్మీ మ‌రో నాయిక‌గా న‌టిస్తుంటే.. 'బ్ర‌హ్మోత్స‌వం'లో స‌మంత‌, ప్ర‌ణీత కూడా న‌టిస్తున్నారు. గ‌త చిత్రాలు 'బాద్‌షా', 'గోవిందుడు అంద‌రివాడేలే', 'టెంప‌ర్' కోసం సోలో హీరోయిన్‌గా సంద‌డి చేసిన కాజ‌ల్‌కి.. కొత్త చిత్రాల కోసం మాత్రం అలాంటి అవ‌కాశం లేకుండా పోయింది. మ‌ల్టీ హీరోయిన్ ప్రాజెక్ట్‌ల‌తో స‌ర్దుకుపోతోంది.

More News

బాలయ్య వందో సినిమా టైటిల్ ఇదే..

నందమూరి నట సింహాం బాలక్రిష్ణ ప్రస్తుతం 99వ చిత్రం డిక్టేటర్ లో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.

గీతా ఆర్ట్స్ లో రాజ్ తరుణ్...

ఉయ్యాలా జంపాల,సినిమా చూపిస్త మామ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన రాజ్ తరుణ్ కుమారి 21ఎఫ్ చిత్రంతో హ్యాట్రిక్ సాధించడానికి వస్తున్నాడు.

'లోఫర్' ఆడియో రిలీజ్ డేట్...

'కంచె' తో నటుడిగా మెప్పించాడు మెగా హీరో వరుణ్ తేజ్.ఆ సినిమా తెచ్చిన గుర్తింపు వల్ల వరుణ్ నెక్ట్స్ ఫిల్మ్ 'లోఫర్ ' పై అందరి దృష్టి పడింది.

వర్మ పై ట్వీ ట్స్ గురించి రాజ్ తరుణ్ వివరణ....

ఉయ్యాల జంపాల చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన యువ కధానాయకుడు రాజ్ తరుణ్.ఉయ్యాల జంపాల తర్వాత సినిమా చూపిస్త మామ చిత్రంతో మరో విజయం సాధించిన రాజ్ తరుణ్ కుమారి 21 ఎఫ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

అక్కినేని నాగచైతన్య , శ్రుతిహాసన్ ల తొలి కాంబినేషన్..ఫిక్స్

అక్కినేని నాగ చైతన్య,శ్రుతి హాసన్ ల తొలి కాంబినేషన్లో 'కార్తికేయ' వంటి ఘన విజయం అందించిన 'చందు మొండేటి..దర్శకత్వంలో