Kadiyam Kavya: వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య

  • IndiaGlitz, [Tuesday,April 02 2024]

తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. మరికొంతమంది కూడా హస్తం కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ దక్కింది. ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు చర్చల అనంతరం వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా కావ్య పేరును ఖరారుచేశారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.

దీంతో తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది. ఇక కీలకమైన హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ మూడు స్థానాలకు వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టనున్నారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరగనున్న జనజాతర సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో వెల్లడించనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ తదితర జాతీయ నేతలు హాజరుకానున్నారు. ఈలోపే మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారుచేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అదే ఊపును కొనసాగించాలని డిసైడ్ అయింది. దీంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన పాలనకు పార్లమెంట్‌ ఎన్నికలే నిదర్శనంగా నిలుస్తాయని బహిరంగంగానే చెప్పారు.

ఈ నేపథ్యంలో 12-14 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాది రాష్ట్రాల్లో కంటే దక్షిణాదిలోనే బలం ఉంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతోంది. అలాగే కేరళలో యూడీఎఫ్ కూటమితో చాలా బలంగా కనిపిస్తుంది. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో వీలైనంత ఎక్కువ స్థానాలు గెలిచి సత్తా చాటాలని చూస్తోంది. ఈ క్రమంలోనే అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. గెలుపు గుర్రాలనే అభ్యర్థులగా నిలబడుతుంది.

More News

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై దళితులు తిరుగుబాటు

ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రత్తిపాడు అభ్యర్థి వరుపుల సుబ్బారావుకు మద్దతుగా అనంతబాబు కొద్దిరోజులుగా ప్రచారం చేస్తున్నారు.

Mahabubnagar MLC: కోడ్ ఎఫెక్ట్.. మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా..

తెలంగాణలో ఇటీవల జరిగిన ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను

Phone Tapping Case: మాజీ డీసీపీ రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు..

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్యాపింగ్‌తో సంబంధం ఉన్న పోలీస్ అధికారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Janasena: జనసేనలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు.. అక్కడి నుంచి పోటీ ఖాయం..

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్ దక్కని టీడీపీ నేతలు జనసేన పార్టీలో చేరడం ఆసక్తిగా మారింది.

నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు.. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు: ఉత్తమ్

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాప్ చేసిందని అప్పటి ప్రతిపక్ష నేతలు ఫిర్యాదులుచేస్తున్నారు.