'జ్యో అచ్యుతానంద' సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Wednesday,August 31 2016]

నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్ర హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయికొర్రపాటి నిర్మించిన చిత్రం 'జ్యో అచ్యుతానంద'. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 9న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.నారారోహిత్‌, నాగ‌శౌర్య‌, రెజీనాల మ‌ధ్య జ‌రిగే క్యూట్ ఫ్యామిలీ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ అయిన ఈ చిత్రంలో నారా రోహిత్‌, నాగ‌శౌర్య‌లు అన్న‌ద‌మ్ములుగా న‌టించారు. ఎమోష‌న్స్‌, ఎంట‌ర్‌టైన్మెంట్ క‌ల‌గ‌లిసిన ముగ్గురు వ్య‌క్తుల మ‌ధ్య జ‌రిగే సున్నిత‌మైన క‌థాంశం. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ 'యు' స‌ర్టిఫికేట్‌ను పొందింది. సెన్సార్ పూర్తి కావ‌డంతో సినిమా రిలీజ్ సెప్టెంబ‌ర్ 9న రావ‌డం ఖాయ‌మైంది.

More News

మురుగదాస్ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చాడు

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎ.ఆర్.మురుగదాస్ చేస్తున్న సినిమా హైదరాబాద్ చిత్రీకరణ జరుపుకుంటుంది. వంద కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తారట.

భూమిని ఇష్టపడే విద్యార్ధి - మనుషులను ఇష్టపడే ఓ పెద్దాయన వీరిద్దరూ కలిస్తే జనతా గ్యారేజ్

మిర్చి, శ్రీమంతుడు చిత్రాలతో వరుసగా బ్లాక్ బష్టర్స్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ కొరటాల శివ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం జనతా గ్యారేజ్.

నందినీ రెడ్డితో విజయ్ దేవరకొండ

అలా మొదలైంది చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి రీసెంట్ గా కల్యాణ వైభోగమే చిత్రంతో కూడా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

జనతా గ్యారేజ్ లో రిలీజ్ తర్వాత మరికొన్ని సీన్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జనతా గ్యారేజ్ చిత్రం సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటా - ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మోహన్ లాల్ కాంబినేషన్లో బ్లాక్ బష్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం జనతా గ్యారేజ్. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జనతా గ్యారేజ్ చిత్రం సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.