close
Choose your channels

YCP సోషల్ మీడియా పోరాటంతోనే కుమారి ఆంటీకి న్యాయం

Wednesday, January 31, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

YCP సోషల్ మీడియా పోరాటంతోనే కుమారి ఆంటీకి న్యాయం

ఇటీవల పాపులర్ అయిన కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. చిరు వ్యాపారులకు తమ ప్రభుత్వం భరోసాగా ఉంటుందని తెలిపారు. త్వరలోనే తాను స్వయంగా వచ్చి ఫుడ్ స్టాల్‌ను సందర్శిస్తానని చెప్పారు. దీంతో ఆమె ముఖంలో ఆనందభాష్ఫాలు కనిపించాయి. దీనికి తమ పార్టీ సోషల్ మీడియా పాత్ర ముఖ్య కారణమని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు.

YCP సోషల్ మీడియా పోరాటంతోనే కుమారి ఆంటీకి న్యాయం

జగనన్న ఇచ్చిన స్థలం మాత్రమే ఉంది..

ఏపీలోని గుడివాడకు చెందిన దాసరి సాయికుమారి తన భర్త పిల్లలతో కలిసి 2011లో హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఫుట్ పాత్ మీద భోజనం అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. భర్త ఆటో డ్రైవర్ కాగా.. పిల్లలు చదువుకుంటున్నారు. అయితే తక్కువ ధరలో రుచికరమైన అందించడంతో కస్టమర్లు పెరుగుతూ వచ్చాయి. దీంతో ఆమె వ్యాపారం మూడు చేపలు, ఆరు రొయ్యలుగా సాగుతోంది. ఇదే సమయంలో కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ఆమెను ఇంటర్వ్యూలు చేయడంతో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. అయితే ఓ ఇంటర్వ్యూలో తనకు ఆస్తిపాస్తులేమీ లేవని సీఎం వైయస్ జగన్ ఇచ్చిన ఇంటి స్థలం మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.

చంద్రబాబు ఆదేశాలతోనే అంటూ..

ఇదిలా ఉంటే ఆమె జగన్ అభిమాని అని తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ యువనేత నారా లోకేష్ వెంటనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పురమాయించి ఆ హోటల్‌కు నోటీసులు ఇచ్చి సీజ్ చేయడం క్షణాల్లో జరిగిపోయిందని వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ విషయం బాగా ట్రెండింగ్ అయిందని.. అందుకే రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. తమ పార్టీ సోషల్ మీడియా పోరాటంతోనే రేవంత్ రెడ్డి దిగొచ్చి కుమారి ఆంటీ హోటల్‌ను అక్కడే ఉంచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారని పోస్టులు పెడుతున్నారు.

YCP సోషల్ మీడియా పోరాటంతోనే కుమారి ఆంటీకి న్యాయం

వైసీపీ సోషల్ మీడియా విజయం..

ఇది కచ్చతంగా తమ పార్టీ సోషల్ మీడియా విజయమని పేర్కొంటున్నారు. జగనన్న ఆర్మీ తలుచుకుంటే ఎవరైనా సరే దిగి రావాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు ఏ దిక్కూ లేనివారికి మద్దతుగా నిలుస్తుందంటున్నారు. అదే సమయంలో టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం జగనన్నకు అనుకూలంగా మాట్లాడేవారి ఫోటోలని, వీడియోలని మార్ఫింగ్ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని విమర్శిస్తున్నారు. ఇదే వైసీపీ సోషల్ మీడియాకి, టీడీపీ-జనసేన సోషల్ మీడియాకి తేడా అని వివరిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment