Kavitha:లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా

  • IndiaGlitz, [Thursday,May 02 2024]

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. బెయిల్ కోసం మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు. సీబీఐ అరెస్ట్‌ చేసినందున తనకు బెయిల్ ఇవ్వాలన్న కవిత పిటిషన్‌పై ఇవాళ తీర్పు రావాల్సి ఉంది. అయితే రౌస్ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఈ తీర్పును మే 6వ తేదీకి వాయిదా వేశారు. అదే రోజు ఈడీ కేసులో బెయిల్‌ పిటిషన్‌పై కూడా తీర్పు వెల్లడించనున్నట్లు తెలిపారు. కాగా కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 22న వాదనలు జరిగాయి.

ఈ సందర్భంగా కవిత తరఫు నాయవ్యాది వాదిస్తూ మహిళగా కల్వకుంట్ల కవిత బెయిల్‌కు అర్హురాలని వాదించారు. ఆమె అరెస్ట్‌ నుంచి విచారణ వరకు కవితకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఈడీ కస్టడీలో ఉండగానే ఎందుకు సీబీఐ అధికారులు ఆమెను అరెస్ట్‌ చేశారని.. అరెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కవిత స్టార్‌ క్యాంపైనర్‌ అని.. ప్రచారం కోసం బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. అలాగే ఆమె పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉందని.. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులకు అరెస్ట్ అవసరం లేదని వాదించారు.

అయితే లిక్కర్ కేసును కవిత ప్రభావితం చేయగలరని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు. లిక్కర్‌ స్కాం కేసులో కవిత కీలకంగా ఉన్నారని.. బెయిల్‌ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు కవితకు తెలుసునని.. ఇతరులు ఇచ్చిన స్టేట్‌మెంట్స్, ఆధారాలపై ఆమెను విచారించినా నిజాలు చెప్పడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో కవిత కింగ్‌ పిన్‌ అని.. ఆమెకు బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును నేటికి వాయిదా వేసింది. అయితే బెయిల్‌పై తీర్పును న్యాయస్థానం ఈనెల 6కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కాగా లిక్కర్‌ స్కాం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తీహార్‌ జైలులో కవిత ఉన్నారు. మళ్లీ ఏప్రిల్‌ 11వ తేదీన సీబీఐ కూడా ఇదే కేసులో కవితను అరెస్టు చేసింది. ఈ రెండు కేసులు సంబంధించి ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. ఈ రెండు కేసుల్లో బెయిల్ కోసం కవిత కోర్టును ఆశ్రయించగా.. సోమవారం తీర్పు రానుంది. దీంతో కోర్టు తీర్పుపై బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

More News

Pawan Kalyan: ఒక్క ఛాన్స్ అయిపోయింది.. జగన్‌ను ఇక ఇంటికి పంపడమే: పవన్

జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయింది.. ఇక ఇంటికి పంపడమే మిగిలింది అని జనసేన అధినేత వపన్ కల్యాణ్ తెలిపారు. ఎలమంచిలి నియోజకవర్గం, అచ్యుతాపురంలో బుధవారం నిర్వహించిన వారాహి

Committee Kurrollu:శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న 'కమిటీ కుర్రోళ్లు'

మెగా డాక్టర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’

Hari Hara Veera Mallu: పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు గూస్‌ బంప్స్‌. అదరగొడుతున్న 'హరిహర వీరమల్లు' టీజర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికల సమయం కావడంతో

KCR:గులాబీ బాస్ కేసీఆర్‌కు బిగ్‌ షాక్.. ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.

Janasena: ముద్రగడ వ్యాఖ్యలు అహంకారపూరితం.. నోరు జాగ్రత్త అంటూ హెచ్చరిక..

పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించడమే తన లక్ష్యం అంటూ వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్ తీవ్రస్థాయిలో స్పందించారు.