పవన్ ఎంట్రీతో నిహారిక పెళ్లి వేడుకలో మరింత జోష్...

నిహారికా కొణిదెల, వెంకట చైతన్య జొన్నలగడ్డ వివాహం బుధవారం సాయంత్రం జరగనుంది. అయితే మంగళవారం సాయంత్రం వరకూ ఒక లెక్క.. సాయంత్రం నుంచి మరో లెక్కగా మారిపోయింది. మెగా ఫ్యామిలీలో ఏ వేడుక జరిగినా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు వేడుక సమయానికి మాత్రమే హాజరవుతుంటారు. కానీ నిహారిక వివాహానికి మాత్రం ఒక రోజు ముందే హాజరై సందడి చేశారు. పిల్లలతో కలిసి మంగళవారం బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఉదయపూర్‌ చేరుకున్నారు.

‘హి ఈజ్‌ ఆన్‌ ద వే’ అని పవన్‌కల్యాణ్‌ ఫొటోను నాగబాబు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ ఫోటో చూసినప్పటి నుంచే అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ ముగ్గురూ ఉన్న పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అలాగే మెగా కజిన్స్ అంతా కూడా పవన్‌తో కలిసి ఫోటో తీసుకున్నారు. పవన్ నూతన వధూవరులను విష్ చేస్తున్న ఫోటో సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పవన్ సంగీత్ వేడుకలో అయితే పాల్గొనలేదు. పవన్ ఉదయ్‌పూర్ చేరుకున్న అనంతరం వివాహ వేడుకలో మరింత జోష్ వచ్చింది.

ఇక.. సంగీత్‌ సంబరాల్లో మెగా హీరోలు అందరూ సందడి చేశారు. చిరంజీవి హిట్‌ చిత్రాల్లో ఒకటైన ‘బావగారూ... బాగున్నారా!’లోని ‘ఆంటీ కూతురా... అమ్మో అప్సర’ పాటకు నిహారిక, చైతన్యల జంట స్టెప్పులతో ఇరగదీశారు. రామ్‌చరణ్‌ ‘వినయ విధేయ రామ’లోని ‘ఏక్‌ బార్‌... ఏక్‌ బార్‌’ పాటకు చిరంజీవి గ్రాండ్‌ చిల్డ్రన్స్‌ వేసిన స్టెప్పులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ‘రేసు గుర్రం’లోని ‘సినిమా చూపిస్త మావ’ పాటకు నాగబాబు దంపతులు, బంధువులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More News

సంచలనం సృష్టించిన ఏలూరు ఘటనకు కారణం ఇదేనట..

జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఏలూరు ఘటనకు సంబంధించిన మిస్టరీని కొంతమేరకు అధికారులు ఛేదించారు.

'షూట్-అవుట్ ఎట్ ఆలేరు' ట్రైలర్ విడుదల చేసిన 'జీ 5', గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్

తెలుగు వీక్షకులకు అత్యుత్తమ కంటెంట్ అందిస్తున్న ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ 5'. తాజాగా మరో ఇంటెన్స్ అండ్ యాక్షన్ డ్రామాను ప్రజల ముందుకు తీసుకొస్తోంది.

ప్రత్యేక విమానంలో ఉదయ్‌పూర్ వెళ్లిన పవన్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేటి మధ్యాహ్నం రాజస్థాన్‌కు బయల్దేరి వెళ్లారు. మెగా డాటర్ నిహారిక వివాహం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.

అరియానా విశ్వరూపం.. టూమచ్

షో స్టార్టింగే.. రూలర్ అయిన అరియానా.. ఒక్కొక్క వస్తువును తీసుకొచ్చి వాటితో తమ అనుబంధాన్ని పంచుకోవాలని చెప్పింది.

తనయుడితో తొలిసారి..

తెలుగు సినీ రంగంలో హీరోగా శ్రీకాంత్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే అంత కంటే ముందే అంటే కెరీర్‌ ప్రారంభంలో శ్రీకాంత్‌ విలన్‌గా కూడా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.