స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతున్న జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా

  • IndiaGlitz, [Tuesday,November 29 2016]

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో శ్రీనివాస‌రెడ్డి న‌టించిన తాజా చిత్రం జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా. ఈ చిత్రంలో శ్రీనివాస‌రెడ్డి, పూర్ణ జంట‌గా న‌టించారు. శివ‌రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై శివ‌రాజ్ క‌నుమూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. స‌మైక్యంగా న‌వ్వుకుందాం అనే ట్యాగ్ లైన్, దేశ‌వాళి ఎంట‌ర్ టైన్మెంట్ అనే నినాదంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతుంది. సినీ విమ‌ర్శ‌కుల‌ను, ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్న జయ‌మ్ము నిశ్చ‌య‌మ్మురా చిత్రం ఇండియాలో 3.78 కోట్లు వ‌సూలు చేసింది

ప్రివ్యూ చూసిన సినీ విమ‌ర్శ‌కులు, సినీ ప్ర‌ముఖుల స‌ల‌హా మేర‌కు 15 నిమిషాల నిడివి త‌గ్గించారు. దీంతో క‌లెక్ష‌న్స్ మ‌రింత‌గా పెరుగుతున్నాయి. సోమ‌వారం కూడా అన్ని ఏరియాల్లో మంచి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేయ‌డం విశేషం. నైజాం 1.48 కోట్లు, ఆంధ్ర 1.56 కోట్లు, సీడెడ్ 54 ల‌క్ష‌లు, రెస్టాఫ్ ఇండియాలో 20 ల‌క్ష‌లు మొత్తం క‌లిపి 3.78 కోట్లు వ‌సూలు చేసింది. చిన్ని సినిమాగా రూపొందిన జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా విజ‌యం సాధించ‌డంతో మంచి చిత్రాల‌కు ఆద‌ర‌ణ ఎప్పుడూ ల‌భిస్తుంద‌ని మ‌రోసారి నిరూపించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేసారు ద‌ర్శ‌క‌నిర్మాత శివ‌రాజ్ క‌నుమూరి..!