జయమ్ము నిశ్చయమ్మురా - కరీంనగర్ టు కాకినాడ సక్సెస్ టూర్

  • IndiaGlitz, [Thursday,December 01 2016]

విడుదలకు ముందు సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, వక్కంతం వంశీ త‌దిత‌ర‌ ప్రముఖుల ప్రశంసలు దండిగా పొందిన "జయమ్ము నిశ్చయమ్మురా" ప్రేక్షకుల ఆదరాభిమానాలను సైతం పుష్కలంగా పొందుతూ.. అసాధారణ విజయం సాధించే దిశగా పరుగులు తీస్తోంది. కరీంనగర్ కుర్రాడు ఉద్యోగం నిమిత్తం కాకినాడ వెళ్లి.. అక్కడ ఓ అమ్మాయి ప్రేమలో పడి.. ఆ ప్రేమను సాధించుకోవడం కోసం ఎన్ని అగచాట్లు పడ్డాడు? ఆ తర్వాత ఎవరితో ఎలా ఆడుకున్నాడు? అనే కథాశంతో ఆద్యంతం అత్యంత వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రం సాధిస్తున్న దేశవాళీ విజయాన్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి "కరీంనగర్ టు కాకినాడ సక్సెస్ టూర్ ప్లాన్ చేసింది చిత్ర బృందం.
డిసెంబర్ 2 (శుక్రవారం) ఉదయం ఆటలో కరీంనగర్ ప్రేక్షకుల్ని పలకరించి.. వరంగల్ లో మధ్యాహ్నం, ఖమ్మంలో ఫస్ట్ షో మరియి సెకండ్ షోల్లో "జయమ్ము నిశ్చయమ్మురా" టీమ్ సందడి చేయనుంది. డిసెంబర్ 3 (శనివారం) ఉదయం ఆటకి విజయవాడ, మధ్యాహ్నం ఆటలో ఏలూరు, సాయంత్రం ఆటకు రాజమండ్రి, సెకండ్ షోకు కాకినాడలోని ధియేటర్స్ లో చిత్ర బృందం సందడి చేయనుంది. ఈ విజయయాత్రలో హీరో,హీరోయిన్స్ శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ, దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరిలతోపాటు ఈ చిత్రంలో నటించిన కృష్ణ భగవాన్, రవివర్మ, ప్రవీణ్, జోగి బ్రదర్స్, మీనా తదితర నటీనటులు పాలుపంచుకోనున్నారని చిత్ర సమర్పకులు ఏ.వి.ఎస్.రాజు ఓ ప్రకటనలో తెలిపారు.
సమైక్యంగా నవ్వుకుందాం" అనే ట్యాగ్ లైన్ తో.. "దేశవాళీ వినోదం" అనే సరికొత్త నినాదంతో నవంబర్ 25న విడుదలైన "జయమ్ము నిశ్చయమ్మురా" మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న విషయం తెలిసిందే !

More News

ఓవర్ సీస్ లో క్లాసిక్ ఎంటర్ టైన్మెంట్ ద్వారా ఖైదీ నెం 150 విడుదల

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మైల్ స్టోన్ గా నిలిచే 150వ చిత్రం ఖైదీ నెం 150. ఈ భారీ యాక్షన్ డ్రామాను డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తెరకెక్కిస్తున్నారు.

జర్నీని మించిన విజయాన్ని మెట్రో సాధిస్తుంది -నందు

వరల్డ్ సినిమాని, మంచి కథలు ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు చూడాలనుకుంటున్నారు. భాష అర్థం కాకపోయినా పొరుగు సినిమాలు చూడాలని ఆశిస్తున్నారు.

గుమ్మడికాయ కొట్టేసిన 'గౌతమిపుత్ర శాతకర్ణి'

నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన హిస్టారికల్ 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`.నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వై.రాజీవ్రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వాల్యూస్ , భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు.

ప‌వ‌న్ మూవీలో నాని హీరోయిన్స్..!

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో ఓ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

బాహుబ‌లి రికార్డ్ ను క్రాస్ చేసిన మ‌హేష్ బాబు..!

ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. తెలుగులో రూపొందిన బాహుబ‌లి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే.థియేట్రిక‌ల్ రెవెన్యూ ప‌రంగానే కాకుండా శాటిలైట్ రైట్స్ విష‌యంలోను బాహుబ‌లి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.