'సైరన్' మోగించడానికి సిద్ధమైన జయం రవి.. ఎప్పుడంటే..?

  • IndiaGlitz, [Monday,February 12 2024]

'తని ఒరువన్' 'కొమాలి' 'పొన్నియిన్ సెల్వన్' లాంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తమిళ స్టార్ హీరో జయం రవి. 'తని ఒరువన్' సినిమాను తెలుగులో రామ్‌చరణ్ హీరోగా 'ధృవ' సినిమాగా రీమేక్ చేశారు. దీంతో ఆయన నటించిన సినిమాలు ఇటీవల తెలుగులో వరుసగా డబ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా 'సైరన్' అనే చిత్రంలో అభిమానులను అలరించేందుకు వస్తున్నారు. అంథోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'గంగ ఎంటర్టైన్మెంట్స్' పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి ఫిబ్రవరి 23న విడుదల చేయబోతున్నారు.

స్టార్ హీరోయిన్లు కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ ఇందులో జయం రవికి జోడీగా నటించారు. ఇటీవల విడుదలైన మూవీ టీజర్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. దీంతో మూవీ యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుజాత విజయకుమార్ మాట్లాడుతూ 'సైరన్' చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ఫ్యామిలీ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ కుదిరేలా తెరకెక్కించామని తెలిపారు. జయం రవి మునుపెన్నడూ కనిపించని లుక్, పాత్రలో కనిపించనున్నారని పేర్కొన్నారు.

సీనియర్ నటుడు సముద్రఖని మాట్లాడుతూ జయం రవి చాలా ప్రతిభ గల నటుడు అని కొనియాడారు. తాము గతంలో కలిసి నటించామని.. ఈ చిత్రంతో తమ ఇద్దరి పాత్రలు అద్భుతంగా వచ్చాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే చిత్రం ఇది వెల్లడించారు.

సంగీత దర్శకుడు జివి ప్రకాష్ మాట్లాడుతూ ఈ చిత్రంలోని పాటలు తనకు చాలా స్పెషల్ అని.. ఈ సంవత్సరం ఇలాంటి చిత్రంతో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

దర్శకుడు ఆంథోని భాగ్యరాజ్ మాట్లాడుతూ ఈ చిత్రం నాకొక కలలా జరిగిపోయింది. ఒక కొత్త దర్శకుడి మొదటి చిత్రం, అదీ పెద్ద హీరోతో అయినప్పుడు, కచ్చితంగా హిట్ అవ్వాలనుకుంటారు. ఆ బాధ్యత జయం రవి గారు తీసుకున్నారు. జివి గారి మెలోడీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ చిత్రానికి ఆయన దాదాపు 20 ట్యూన్లు ఇచ్చి ఎప్పటికప్పుడు నాలో స్ఫూర్తి నింపుతూనే ఉన్నారు. చిత్రం అద్భుతంగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులకి నచ్చుతుందని ఆశిస్తున్నాం అన్నారు.

హీరో జయం రవి మాట్లాడుతూ ఈ చిత్రంలో ఎమోషన్స్ చాలా ముఖ్య పాత్రలు వహిస్తాయి. ఇక జివి ప్రకాష్ తన సంగీతంతో ప్రాణం పోశాడు. ఇండియాలో ఉన్న మేటి సంగీత దర్శకుల్లో జి.వి అగ్రస్థానంలో ఉంటాడు. అలాగే ఈ చిత్రంలో ముఖ్యమైన లేడి పోలీస్ ఆఫీసర్ పాత్రకి కీర్తి బాగుంటుంది అనుకున్నాం. మా నమ్మకాన్ని తను పూర్తిగా నిలబెట్టింది. ఆంథోనీ భాగ్యరాజ్ రానున్న కాలంలో చాలా ఎత్తుకు ఎదగడం ఖాయం. కొత్త దర్శకులతోనే చేస్తున్నందుకు నన్ను చాలా మంది మందలిస్తుంటారు. కానీ ప్రతిభ గల దర్శకులతో పనిచేయడం నాకు ఇష్టంగా ఉంటుంది. ఈ చిత్రంలో నేను రెండు విభిన్నమైన పాత్రలు పోషించాను. మా 'సైరన్' ప్రేక్షకులని ఆద్యంతం ఆకట్టుకుంటుందనే నమ్మకం పూర్తిగా ఉంది అని తెలిపారు.

More News

Rajgopal Reddy: హరీష్‌రావును కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రాజగోపాల్‌ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల విమర్శలు, ప్రతివిమర్శలతో సభ వేడెక్కింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్‌చాట్ చేసిన

Nitish Kumar: బలపరీక్షలో నెగ్గిన నితీష్ కుమార్.. ఆర్జేడీ కూటమికి భారీ షాక్..

జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ బీహార్‌ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో నెగ్గారు. మొత్తం 243 స్థానాలు ఉన్న అసెంబ్లీలో.. నితీష్ ప్రభుత్వం కొనసాగాలంటే 122 మంది ఎమ్మెల్యేల

Mahi V Raghav: రాయ‌ల‌సీమ‌కు ఏమైనా చేశారా? ఇండస్ట్రీపై 'యాత్ర2' దర్శకుడు విమర్శలు..

ఏపీ సీఎం వైయస్ జగన్ జీవితంలో జరిగిన ఘటనల గురించి తెరకెక్కించిన 'యాత్ర-2' సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే ఈ చిత్రం దర్శకుడు మహి వి రాఘవ్ గురించి

AP DSC Notification: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..

డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్ చేశారు. 6,100 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

Revanth Reddy: కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు.. హరీష్‌ రావు కౌంటర్..

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.