‘జాతిరత్నాలు’ అదరగొడుతున్న స్పెషల్ సాంగ్...

  • IndiaGlitz, [Saturday,March 20 2021]

చాలా కాలం తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి కడుపుబ్బ నవ్వుకున్నారంటే దానికి కారణం ‘జాతిరత్నాలు’. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. కేవీ అనుదీప్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఎవరి నోట విన్నా ‘జాతిరత్నాలు’ టాకే. ‘కంటెంట్ ఉన్నోడికి.. కటౌట్ ఎందుకు?’ అంటూ ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. దీనికి ఈ సినిమా రివర్స్. నిజానికి ఈ సినిమాలో కంటెంట్ అయితే ఏమీ లేదు.. కేవలం కటౌట్ చూసి ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లారంతే.. ఆ తరువాత మౌత్ టాక్ సినిమాకు బీభత్సంగా లభించింది. అంతే సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

‘జాతిరత్నాలు’గా నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ అదరగొట్టేశారు. అలాగే ఈ సినిమాకు సంగీతం మరో హైలైట్. ఎవరి నోట విన్నా ఈ చిత్రంలోని పాటలే వినిపిస్తున్నాయి. దీంతో చిత్ర యూనిట్ మరో స్టెప్ తీసుకుంది. తాజాగా ఈ సినిమాకి మరో పాటను యాడ్ చేసింది. సినిమాలో ఒక్కటే టైటిల్ సాంగ్ ఉంటుంది. కానీ ఈ సినిమా టైటిల్‌తోనే మరో సాంగ్‌ను పాడించి యూట్యూబ్‌లో విడుదల చేసింది. ‘అర్రెరెరె జాతిరత్నాలు..ఎన్నడు చూడని నవ్వుల వర్షాలు..’అనే స్పెషల్‌ సాంగ్‌ని వైజయంతి నెట్‌వర్క్‌ సంస్థ తన యూట్యూబ్‌లో షేర్‌ చేసింది.

రామ్‌ మిర్యాల పాడిన ఈ పాట సోషల్‌ మీడియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సాంగ్ కూడా అద్భుతంగా ఉండటంతో నెటిజన్లకు బాగా కనెక్ట్ అయింది. విడుదల చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్‌తో దూసుకుపోతోంది. ఈ పాటకు సంబంధించిన వీడియోలో సినిమా ప్రమోషన్స్‌కు సంబంధించిన విజువల్స్‌ని పంచుకున్నారు. స్వప్న సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన ఈ చిత్రంలో హైదరాబాద్‌ అమ్మాయి ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. ఇతర కీలక పాత్రల్లో బ్రహ్మానందం, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌, బ్రహ్మజీ, తనికెళ్ల భరణి తదితరులు నటించారు.

More News

సందడిగా ‘రంగ్‌దే’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. నితిన్‌కు అభిమాని ఆసక్తికర ప్రశ్న..

అశేష అభిమానుల మ‌ధ్య క‌ర్నూలులో గ్రాండ్‌గా 'రంగ్ దే' ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌ జరిగింది. ఆద్యంతం న‌వ్వుల‌తో ఈ ట్రైలర్ అల‌రించింది.

'చావు కబురు చల్లగా'కు ఝలక్ ఇచ్చిన పోలీసులు

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా.. కౌశిక్ పెగ‌ళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. ఆమని, మురళి శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, భద్రం తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఇట‌లీలో షూటింగ్ జ‌రుపుకుంటున్న ర‌వితేజ‌ 'ఖిలాడి'

'క్రాక్' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా, 'రాక్ష‌సుడు' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని తెర‌కెక్కించిన ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో

ఏపీ నగరపాలక సంస్థల మేయర్‌ల విషయంలో ఆసక్తికర విషయాలివే..

ఏపీలోని నగరపాలక సంస్థల్లో కొత్త మేయర్లు కొలువుదీరిన విషయం తెలిసిందే. అయితే దీనిలో కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి.

ముగ్గురు పసివాళ్లకు విషమిచ్చి.. తానూ ఆత్మహత్యాయత్నం

అభం శుభం.. పాపం పుణ్యం తెలియని చిన్నారులు.. అమ్మ ఏదిచ్చినా అమృతంలా భావించి తాగేస్తారు..