అక్కడ మాత్రం మెప్పించలేకపోయిన ‘జాతిరత్నాలు’

  • IndiaGlitz, [Friday,April 16 2021]

చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన చిత్రం ‘జాతిరత్నాలు’. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి పండించిన కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. లాక్‌డౌన్ తర్వాత ప్రేక్షకులు పెద్ద మొత్తంలో కరోనా మహమ్మారిని మరిచి అంతా హాయిగా థియేటర్లకు వచ్చి చూసిన తొలి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. మార్చి నెల మొత్తమ్మీద విడుదలైన సినిమాల్లో ఈ సినిమాయే ప్రేక్షకుల ఆదరణను విశేషంగా సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్‌సీస్‌లోనూ అద్భుత విజయాన్ని సాధించింది.

ఇదిలా ఉండగా ‘జాతిరత్నాలు’ చిత్రం ఈ నెల 11న ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా ఓటీటీలో మాత్రం బోల్తా కొట్టింది. ఓటీటీలో ఎప్పుడెప్పుడు ఈ చిత్రం విడుదలవుతుందా.. అని ఎదురు చూసిన ప్రేక్షకులు సినిమా విడుదలైన తర్వాత మాత్రం ఆదరించలేకపోయారు. థియేటర్స్ లో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసరికి నవ్వించలేకపోయింది. తమకు నచ్చలేదుంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

ఓటీటీలో సినిమా చూశాక ఇందులో ఏముందని ఇంతగా ఆడిందని ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. చిత్రంలో 'కంటేంటే లేదు, ఓవర్‌ రేటెడ్‌ కామెడీ తప్పా' అని సినిమాను ఓటీటీలో చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఓటీటీలో సైతం ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభిస్తుందని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. సినిమాలో విషయమే లేదంటూ తేల్చేస్తున్నారు. థియేటర్‌లో జనం మధ్యన చూసిన సినిమాకు.. ఇంట్లో ఒకరిద్దరి మధ్య కూర్చొని చూసిన సినిమాకు తేడా ఉంటుందని ఈ సినిమా తేల్చింది.

More News

శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ మార్చుకుందట..

లవ్ స్టోరీలను సైతం నీట్ అండ్ క్లీన్‌గా ప్రెజెంట్ చేయడంలో దిట్ట.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల.

నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ కాకర్ల సుబ్బారావు మృతి

ప్రముఖ వైద్య నిపుణులు, నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ కాకర్ల సుబ్బారావు (96) కన్నుమూశారు. గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్‌ ఆస్పత్రిలో

ఓ వ్యక్తిని నమ్మి మోసపోయిన నిక్కీ గల్రానీ

బిజినెస్ ఏదైనా సరే.. కలిసొచ్చిందా.. వెనక్కి తిరిగి చూసుకునే పని ఉండదు. కలిసి రాలేదా.. అంతా కొలాప్స్.

మూఢనమ్మకంతో నెలల చిన్నారి గొంతుకోసి హతమార్చిన తల్లి

మూఢ నమ్మకాల మత్తులో మరీ బాగా చదువుకున్న వారే పడుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

పదో తరగతి పరీక్షల రద్దు.. ఇంటర్ వాయిదా..

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.