ఆలోచింప చేస్తున్న గ్యారేజ్ డైలాగ్స్

  • IndiaGlitz, [Saturday,August 13 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్ లో రూపొందుతున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. జ‌న‌తా గ్యారేజ్ టీజ‌ర్ & ట్రైల‌ర్ లో రిలీజ్ చేసిన డైలాగ్స్ ఆలోచింప చేస్తూ విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ప్ర‌తి డైలాగ్ లో కొర‌టాల మార్క్ క‌నిపిస్తుంది. ఈ భూమి అన్నా...ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం..! చెట్లు, మొక్క‌లు, గాలి, నీరు వాటిని కాపాడుకోవ‌డ‌మే నా ప‌ని కూడా.! ఆ చెట్టు అంతే ఎంత ప్రాణ‌మో బుజ్జి అంటే కూడా అంతే ప్రాణం అమ్మా..!

ఎక్క‌డో ఇంకో చోట పెద్ద మ‌నిషికి ఈ భూమి మీద ఉండే మ‌నుషులంటే ఇష్టం. ఆ సృష్టికే ఇద్ద‌రినీ కలిపితే బాగుంటుంది అనిపించింది..! ఆయ‌న ఒక అద్భుత‌మైన మాట చెప్పారు. మొక్క‌ల‌తో పాటు మ‌నుషుల‌ను కాపాడితే భూమి ఇంకా అందంగా ఉంటుంది..! బ‌ల‌వంతుడు బ‌ల‌హీనుడ్ని భ‌య‌పెట్టి బ‌త‌క‌డం ఆన‌వాయితీ...బ‌ట్ ఫ‌రే ఛేంజ్ ఆ బ‌ల‌హీనుడి ప‌క్క‌న కూడా ఒక బ‌లం ఉంది జ‌న‌తా గ్యారేజ్..! అంటూ ఎన్టీఆర్ చెబుతున్న డైలాగ్స్ సినిమా పై అంచ‌నాల‌ను మ‌రింత పెంచేస్తున్నాయి. టీజ‌ర్ & ట్రైల‌ర్ లోనే ఇలా ఉంటే...ఇక సినిమాలో ఇంకెన్ని అద్భుత‌మైన డైలాగ్స్ ఉన్నాయో..!

More News

ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న న‌వీన్‌చంద్ర చిత్రం

అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్‌టైగర్‌'వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె. రాధామోహన్‌ 'ఓ చినదాన', 'ఒట్టేసిచెబుతున్నా', 'తిరుమల తిరుపతి వెంకటేశ', 'ఏవండోయ్‌ శ్రీవారు', 'యముడికి మొగుడు', 'బెట్టింగ్‌ బంగార్రాజు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నిర్మిస్తున్న పూర్త&

ల‌క్ష్మి బాంబ్ కోసం మంచు మ‌నోజ్ ఫైట్స్

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీ నరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్‌

'జ‌న‌తాగ్యారేజ్'ఆల‌స్యం అవుతుందా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్ రూపొందుతోన్న చిత్రం ‘జ‌న‌తాగ్యారేజ్’. సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. మిర్చి, శ్రీమంతుడు చిత్రాలు త‌ర్వాత ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న మూడో చిత్ర‌మిది.

డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల్లో గోపీచంద్ 'ఆక్సిజన్'

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.

నీజ‌త‌లేక ప్ర‌మోష‌న‌ల్ టైటిల్ సాంగ్ రిలీజ్

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా పారుల్‌, సరయు హీరోయిన్స్‌గా శ్రీ సత్య విదుర మూవీస్‌ పతాకంపై లారెన్స్‌ దాసరి దర్శకత్వంలో జి.వి.చౌదరి, నాగరాజ్‌ గౌడ్‌ చిర్రా నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'నీ జతలేక'. కరుణాకర్‌ కంపోజ్‌ చేసిన ఈ సినిమా ప్రమోషనల్‌ టైటిల్‌ సాంగ్‌ను చిత్ర యూనిట్‌ శనివారం హైదరాబాద్‌ రేడియో సిటీలో విడుదల చేశారు.