జ‌న‌తా గ్యారేజ్ లో చేరిన ఎన్టీఆర్

  • IndiaGlitz, [Saturday,March 05 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్ధ నిర్మిస్తుంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ముఖ్య‌పాత్ర పోషిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రులో జ‌న‌తా గ్యారేజ్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ఫ‌స్ట్ షెడ్యూల్ లో మోహ‌న్ లాల్ పై ముఖ్య స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.

అయితే ఈరోజు నుంచి జ‌న‌తా గ్యారేజ్ షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ అవుతున్నారు. ఈరోజు నుంచి ముంబాయిలో జ‌రిగే షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొంటున్నారు. ఇర‌వై రోజులు పాటు ముంబాయిలో షూటింగ్ చేయ‌నున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగ‌ష్టు 12న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.