Nadendla Manohar: హెలికాఫ్టర్‌లో వెళ్లడమే .. జనం గోడు పట్టదు: జగన్‌ పాలనపై నాదెండ్ల విమర్శలు

  • IndiaGlitz, [Monday,June 05 2023]

పదవీ కాలం పూర్తయ్యే సరికి ఎన్ని కోట్లు మిగిలాయి? ఎన్ని వేల కోట్లు వెనకేసుకున్నాం అని ఆలోచించే వారి కనుసన్నల్లో ఆంధ్రప్రదేశ్ నడుస్తోందన్నారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఆదివారం తెనాలి నియోజకవర్గం, కొల్లిపర మండలం, చక్రాయపాలెం గ్రామంలో నిర్వహించిన జనసేన శ్రేణుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో రైతాంగానికి నష్టం జరిగితే కనీసం వారిని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభ దశలో ఉందన్న ఆయన రైతులు వలసలు వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తోందని నాదెండ్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రైతులను కలుసుకునేందుకు పవన్ కళ్యాణ్‌తో కలిసి తూర్పుగోదావరి జిల్లా వెళ్ళినప్పుడు అక్కడున్న రైతులు చెప్పిన సమస్యలు వింటే కళ్లు చెమర్చాయని ఆయన గుర్తుచేసుకున్నారు.

పాత బిల్డింగ్‌లకు రంగులేసి .. నిధులు జేబుల్లోకి :

ఈ ప్రభుత్వ విధానాలు రైతుకు ఏ మాత్రం మేలు చేసేవిగా లేవని.. కేంద్రం ఇస్తున్న రూ. 7,500కి తోడు, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 6,500 ఇచ్చి చేతులు దులుపుకుంటోందని నాదెండ్ల దుయ్యబట్టారు. బటన్ నొక్కితే జీవితాలు బాగుపడిపోవని.. క్షేత్రస్థాయిలో రైతుల బాధలను కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం గోనె సంచులు కూడా సరఫరా చేయలేని అసమర్ధ ప్రభుత్వమని.. రైతు భరోసా కేంద్రాల ద్వారా రూ. 6,300 కోట్ల అవినీతి జరిగిందని, ఉన్న భవనాలకే రంగులు వేసి నిధులను జేబులో వేసుకున్నారని మనోహర్ ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది ఉండటం లేదని.. ఉన్న వారితో రైతులకు ఏమాత్రం ప్రయోజనం చేకూరడం లేదని మండిపడ్డారు. ఈ హెలికాప్టర్ ముఖ్యమంత్రి.. ఎక్కడికి వచ్చినా ఆ ప్రాంతంలో కనీసం ప్రజలతో, రైతులతో మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. రైతులకు కనీస గౌరవం ఇవ్వని వ్యవస్థ రాష్ట్రంలో నెలకొందని, అభివృద్ధిపై కనీస ప్రణాళికా లేదని మనోహర్ చురకలంటించారు.

బటన్లు నొక్కుతూ అభివృద్ధి పక్కనబెట్టారు :

రాజధాని నిర్మాణం నిమిత్తం రాజకీయాలకు అతీతంగా అమరావతి రైతులు 30 వేల ఎకరాల భూమి ఇచ్చారని.. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అమరావతికి తీరని ద్రోహం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి గురించి పోరాడుతున్న రైతులతో కనీసం చర్చించని, వారితో కనీసం మాట్లాడని నైజం ముఖ్యమంత్రిదన్నారు. ముఖ్యమంత్రి నివాసానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతులతో మాట్లాడలేని ఈ ముఖ్యమంత్రికి రైతుల మీద ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా అప్పట్లో భూములను ఇచ్చిన రైతులు భవిష్యత్తు మీద ఎన్నో కలలు కన్నారని.. భూములకు ధరలు పెరుగుతాయని , తమ బతుకులు బంగారం అవుతాయని భావించారని నాదెండ్ల పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష కట్టినట్లు రైతులను పూర్తి స్థాయిలో నాశనం చేసిందని.. సంక్షేమం పేరుతో ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మనోహర్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర అప్పులు రూ.6 లక్షల కోట్లకు చేరాయని.. అభివృద్ధి ఎక్కడుంది..? కనీసం రోడ్లు కూడా వేయకుండా బటన్లు నొక్కుతున్నామంటూ ప్రజలను భ్రమ పెడుతున్నారని నాదెండ్ల చురకలంటించారు.

వైసీపీ నేతలు ధనవంతులయ్యారు :

జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో సెంటు స్థలం పేదలకు ఇస్తున్నామని చెప్పి, వేలకోట్లను వైసీపీ నాయకులు జేబులో వేసుకున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రైతుల వద్ద నామమాత్రపు ధరకు భూములను కొని, వాటిని భారీ మొత్తానికి ప్రభుత్వానికి అమ్మారని, ఫలితంగా వైసీపీ నాయకులు ధనవంతులయ్యారని ఆయన పేర్కొన్నారు. పేదలు కనీసం సెంటు స్థలంలో ఇల్లు కట్టుకోలేక, ప్రభుత్వం ఇచ్చిన డ్వాక్రా రుణాలకు వడ్డీలు కట్టుకోలేక సతమతమవుతున్నారని నాదెండ్ల ఆరోపించారు

More News

Train Derailment: ఒడిషాలో మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్

గత శుక్రవారం ఒడిషాలోని బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే . ఈ సంఘటన దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Nadendla: రాష్ట్ర విభజన... తెలంగాణ ముందుకు, ఏపీ వెనక్కు .. అంతా పవన్ చెప్పినట్లే : నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంతగా నష్టపోతుందో పవన్ కళ్యాణ్ చెప్పినట్లే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.

బీహార్‌ : నిర్మాణంలో వుండగానే కుప్పకూలిన బ్రిడ్జి .. కోట్ల రూపాయలు గంగపాలు, వీడియో వైరల్

ఒడిషాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోవడంతో దేశ ప్రజలు ఇంకా ఆ విషాదం నుంచి తేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో చిన్న ప్రమాదాలు జరిగినా ఉలిక్కిపడుతున్నారు.

ఇసుక మాఫియా చేతిలో జనసైనికుడి దారుణ హత్య .. ప్రశ్నిస్తే చంపేస్తారా : జనసేన నేత తమ్మిరెడ్డి శివశంకర్

శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో ఇసుక మాఫియా చేతిలో సదాశివుని రాజేశ్ అనే జనసేన కార్యకర్త హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై జనసేన వర్గాలు భగ్గుమంటున్నాయి.

ఓ ఇంటివాడైన శర్వానంద్.. రక్షితా రెడ్డితో ఏడడుగులు వేసిన హీరో, జైపూర్‌లో గ్రాండ్‌గా వెడ్డింగ్

టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ ఓ ఇంటి వాడయ్యాడు. శనివారం రాత్రి రక్షితా రెడ్డి మెడలో ఆయన మూడు ముళ్లు వేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని లీలా ప్యాలెస్ వేదికగా శర్వా- రక్షితల వివాహం