Pawan Kalyan:పవన్ చేతికి తాబేలు ఉంగరం గమనించారా.. ఈసారి జనసేనాని జ్యోతిష్యాన్ని నమ్ముకున్నారా..?

  • IndiaGlitz, [Sunday,April 09 2023]

పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో ఫుల్ బిజీ. చేతిలో వున్న సినిమాలను పూర్తి చేసి 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారు. సినిమాలను, రాజకీయాలను బ్యాలెన్స్‌డ్‌గా నడిపిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏమాత్రం కలిగి వున్నా తన సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తున్నారు. ఈ సారి పాలిటిక్స్‌లో సత్తా చాటాలని జనసేనాని గట్టి పట్టుదలగా వున్నారు. అందివచ్చిన ఏ అవకాశాన్ని ఆయన వదిలిపెట్టడం లేదు.

భగవంతుడి ఆశీస్సులతో ముందుకెళ్లాలనుకుంటున్న పవన్ :

అయితే ఎన్నడూ లేని విధంగా పవన్ కల్యాణ్ భారాన్ని కాస్త దేవుడిపైనా వేసినట్లుగా కనిపిస్తోంది. ఆయనను ఈ మధ్యకాలంలో గమనిస్తే పవర్‌స్టార్‌లో మార్పు సుస్పష్టం. రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి సిద్ధం చేసుకున్న ప్రచార రథానికి వారాహీ అని పేరు పెట్టడం ఇందులో ఒకటి. లలితా దేవికి దండ నాయికిగా వ్యవహరించే వారాహీ దేవిని ఆరాధిస్తే శత్రు జయం, అన్నింట్లో విజయం తథ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఆయన పెద్దల సలహాను అనుసరించి తన వాహనానికి వారాహీ అని పెట్టుకున్నారు. ఇక అన్నింట్లో మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహా సూచనలు కంపల్సరీ.

తాబేలు ఉంగరం పెట్టుకుంటే జరిగేది ఇదే:

ఇదిలావుండగా..పవన్ కల్యాణ్ ఈసారి జ్యోతిష్యాన్ని కూడా ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది. తనను వెనక్కి లాగుతున్న శక్తులు, పనిలో ఆటంకాలను అధిగమించేందుకు ఏం చేయాలన్న దానిపై పండితులను అడిగి కొన్ని పరిహారాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీనిలో భాగంగానే జనసేనాని తాబేలు ఉంగరం పెట్టుకున్నారని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల వరంగల్ నిట్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన పవన్ కల్యాణ్ కుడిచేతిని జాగ్రత్తగా గమనిస్తే తాబేలు ఉంగరం స్పష్టం కనిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఉంగరాన్ని పెట్టుకుంటే పాజిటివ్ శక్తితో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందట. శ్రీమహావిష్ణువు దశావతారాలలో కూర్మావతారం ఒకటన్న సంగతి తెలిసిందే. ఆ కారణం చేత కూడా తాబేలు ఉంగరం పవర్ ఫుల్ . ఈ క్రమంలోనే రాజకీయ రంగంలో విజయం సాధించడానికే పవన్ ఈ ఉంగరాన్ని ధరించి వుంటారనే చర్చ జరుగుతోంది.

More News

Game On:సమ్మర్‌లో ‘గేమ్‌ఆన్‌’

గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. కస్తూరి క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌, గోల్డెన్‌ వింగ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై దయానంద్‌ దర్శకత్వంలో

Kiran Kumar Reddy : బీజేపీలో కిరణ్ కుమార్ రెడ్డికి కీలక పదవి.. కర్ణాటక ఎన్నికల బాధ్యతలు కూడా..?

కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కమలనాథులు కీలక బాధ్యతలు  కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

PM Narendra Modi:సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్‌‌ను ప్రారంభించిన మోడీ.. కేసీఆర్ ఫ్యామిలీపై విమర్శలు

సికింద్రాబాద్ - తిరుపతి మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.

Malls and Shop:తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై 24 గంటలూ షాపులు, మాల్స్‌ ఓపెన్

సాధారణంగా ఎక్కడైనా దుకాణాలు ఉదయం 10 గంటలకు తెరచుకుని రాత్రి 10 .. కొన్ని చోట్ల 11 గంటల వరకు అందుబాటులో వుంటాయి.

అవి కమ్మ నందులు.. ఏ కాంపౌండ్‌కి ఎన్నో ముందే డిసైడ్, డామినేషన్ ఎవరిదంటే : పోసాని సంచలన వ్యాఖ్యలు

పోసాని కృష్ణ మురళీ.. టాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్. మనసులో ఎలాంటి దాపరికం లేకుండా ఉన్నది వున్నట్లు కుండబద్ధలు కొడుతుంటారు.