Jana Sena, BJP:తెలంగాణలో కమలంతో జనసేన దోస్తీ.. మరి ఏపీలో పరిస్థితేంటి..?

  • IndiaGlitz, [Wednesday,November 08 2023]

తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల నగారా మోగి ప్రచారం హోరెత్తుతుండగా.. ఏపీలో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ నిర్ణయాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుని 8 స్థానాల్లో ఎన్నికల బరిలో దిగారు. మంగళవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీతో కలిసి పవన్ కల్యాణ్‌ వేదిక పంచుకున్నారు. అంతేకాకుండా తన ప్రసంగంలో మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ ఎప్పుడూ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు తప్ప.. ఎన్నికల ప్రయోజనాల కోసం కాదన్నారు. మోదీ మరోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వరకు బాగానే ఉంది. కానీ ఏపీలో మాత్రం టీడీపీతో పొత్తులో ఉన్నారు. వైసీపీని ఓడించడమే తన లక్ష్యమని.. రాష్ట్ర భవిష్యత్ కోసం తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. అయితే 2019 ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు పవన్. కానీ ఉమ్మడిగా కలిసి ప్రభుత్వంపై పోరాటం చేసిన దాఖలాలు లేవు. జనసేన ఒక్కటే ప్రభుత్వ పాలనపై తీవ్ర పోరాటం చేస్తుంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై సీఎం జగన్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ కావడంతో పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు బహిరంగంగా ప్రకటించేశారు. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నట్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇంతవరకు బీజేపీ పెద్దల నుంచి సరైన స్పందన లేదు.

తెలంగాణలో మాత్రం జనసేనతో కలిసి కమలం నేతలు ఎన్నికలకు వెళ్తున్నారు. ఏపీలో ఎన్నికల నాటికి బీజేపీ కూడా తమ కూటమికి మద్దతు ఇస్తుందని పవన్ భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాత్రం జనసేనతో బీజేపీ పొత్తులో ఉందని.. టీడీపీతో పొత్తుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఒకవేళ తమతో జనసేన కలిసి రాకపోతే ఒంటరిగానే 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఓవైపు ఏమో బీజేపీ తమతో కలిసి వస్తుందని పవన్ భావిస్తుంటే.. బీజేపీ నేతలు మాత్రం జనసేన తమతో కలవకపోతే ఒంటరిగా బరిలో దిగుతామని స్పష్టం చేస్తున్నారు. దీంతో ప్రజలు డైలమాలో పడ్డారు. అక్కడ ఉన్న పొత్తు ఇక్కడ ఎందుకు ఉండటం లేదని చర్చిస్తున్నారు. మరి ఎన్నికల నాటికి బీజేపీ కూడా జనసేనతో కలిసి టీడీపీకి మద్దతు ఇస్తుందా? లేదా అనేది వేచిచూడాలి.

More News

Telangana High Court:అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య

NBK 109: బ్లడ్ బాత్ కి బ్రాండ్ నేమ్ .. NBK109 షూటింగ్ షురూ..

నటసింహం నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్నారు.

Khammam district:అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం జిల్లా యువకుడు మృతి

విదేశాల్లో ఉన్నత చదువులు చదివితే మంచి భవిష్యత్‌ ఉంటుందని ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తూ ఉంటారు.

Janasena:8 మందితో జనసేన అభ్యర్థుల జాబితా విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.

Raja Singh:అందుకే ప్రధాని మోదీ సభకు హాజరుకాలేదు..? రాజాసింగ్ క్లారిటీ..

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం హైదరాబాద్‌ బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే.