'జై సింహా' సెన్సార్ డేట్ ఫిక్స‌య్యిందా?

  • IndiaGlitz, [Sunday,December 10 2017]

నట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన తాజా చిత్రం జై సింహా. సింహా, శ్రీ‌రామరాజ్యం చిత్రాల్లో బాల‌య్య‌కి జోడీగా న‌టించిన న‌య‌న‌తార ఈ చిత్రంలోనూ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. సి.క‌ళ్యాణ్ ప్రతిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న‌ ఈ చిత్రానికి చిరంత‌న్ భ‌ట్ సంగీతమందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా రెండు పాట‌లు మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుంది. కాగా, ఆడియోని ఈ నెల 24న హాలీల్యాండ్‌లో విడుద‌ల చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు డిసెంబ‌ర్ 28న జ‌రుగుతాయ‌ని తెలిసింది.

యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నటాషా దోషి, హ‌రి ప్రియ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. బాల‌కృష్ణకి అచ్చొచ్చిన సీజ‌న్ అయిన సంక్రాంతి స‌మ‌యంలో జై సింహా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. జ‌న‌వ‌రి 12న రానున్న ఈ చిత్రంతో బాల‌య్య‌, న‌య‌న్ హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి.

More News

లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్

సుప్రసిద్ధ నటీమణి గౌతమి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా అందలాన్నందుకొన్న గౌతమి ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్ ను సైతం జయించి, తనలా మరెవరూ బాధపడకూడదనే దృఢ నిశ్చయంతో "లైఫ్ ఎగైన్" ఫౌండేషన్ ను ప్రారంభించారు.

మరో దృశ్యం ఆడియో విడుదల

కట్ల రాజేంద్ర ప్రసాద్, అవంతిక, గౌతమ్ , కోలా మధు సిందూర ముఖ్య పాత్రల్లో కట్ట రాజేంద్ర ప్రసాద్ దర్శకతంలో గంగోత్రి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకం పై శ్రీపతి గంగాదాస్ నిర్మిస్తున్న మరో దృశ్యం చిత్రంలోని పాటలు ఆదివారం ఫిలిం ఛాంబర్ లో  విడుదల అయ్యాయి.

ఈ నెల 15న 'ప్రేమపందెం' విడుదల

ఎం.ఎం. అర్జున్‌ దర్శకత్వంలో శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్‌ పతాకంపై అనంతపురం జిల్లాకు చెంది ప్రముఖ విద్యాసంస్థల అధిపతి ఎం. లక్ష్మీనారాయణ నిర్మాతగా, జబర్‌దస్త్‌ వినోద్‌, కిరణ్‌ కళ్యాణ్‌, నరేష్‌, సాంబశిమ హీరోుగా, మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా నిర్మించిన చిత్రం 'ప్రేమపందెం'.

దంగ‌ల్ న‌టికి చేదు అనుభవం

సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టీమ‌ణులంద‌రూ ఈ మ‌ధ్య త‌మ‌కు ప‌రిశ్ర‌మ‌లో ఎదురైన చేదు అనుభ‌వాల‌పై పెద‌వి విప్పుతున్నారు. ఇదొక హాట్ టాపిక్ అయ్యింది.

కీర్తి.. ఈ సారి త‌క్కువే

తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా.. మంచి విజ‌యాల‌నే మూట‌గ‌ట్టుకుంది కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్‌. నేను శైల‌జతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ చిన్న‌ది.. ఆ త‌రువాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని నేను లోక‌ల్‌తో సంద‌డి చేసింది.