'జై సింహా' ఆడియో డేట్ ఫిక్స‌య్యింది

  • IndiaGlitz, [Wednesday,November 15 2017]

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 102వ చిత్రం జై సింహా. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. న‌య‌న‌తార‌, న‌టాషా దోషి, హ‌రిప్రియ క‌థానాయిక‌లు. ఇటీవ‌ల విడుదల చేసిన ఈ సినిమా ఫ‌స్ట్‌లుకి మంచి స్పంద‌న వ‌చ్చింది.

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణికి సంగీత‌మందించిన చిరంత‌న్ భ‌ట్ ఈ చిత్రానికి సంగీత‌మందిస్తున్నాడు. కాగా, ఈ సినిమా ఆడియోని వ‌చ్చే నెల 23న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిసింది. సినిమాని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరి 12న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

బాల‌కృష్ణ న‌టించిన వందో చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిని కూడా ఈ ఏడాది ఇదే తేదికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. సింహా, శ్రీ‌రామ‌రాజ్యం త‌రువాత బాల‌కృష్ణ‌, న‌య‌న‌తార కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమా వారిద్ద‌రికి హ్యాట్రిక్ మూవీ అవుతుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. బాల‌కృష్ణ ప‌వ‌ర్ ఫుల్ రోల్‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార పెర్ ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని తెలిసింది.

More News

2019 వేస‌వికి భార‌తీయుడు2?

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ద్విపాత్రాభిన‌యంలో ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ రూపొందించిన భార‌తీయుడు చిత్రం ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

మా శ్రమకు ఫలితమే ఈ నంది పురస్కారం..- దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్

భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన బాలల చిత్రం ఆదిత్య క్రియేటివ్ జీనియస్. మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాల్లో 2014 సంవత్సరానికి ఉత్తమ బాలల చిత్ర దర్శకుడిగా ఎంపికయ్యారు సుధాకర్ గౌడ్.

75 రోజుల షాలిని

ఆమోగ్ దేశపతి ,అర్చన ,శ్రేయవ్యాస్  హీరో హీరోయిన్లుగా  షెరాజ్ దర్శకత్వంలో లయన్ సాయి వెంకట్  సమర్పణలో స్వర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వి. సత్యనారాయణ నిర్మించిన  "షాలిని'' చిత్రం ఇటీవలే విడుదలై 75 రోజులు పూర్తీ చేసుకున్న సందర్బంగా హైద్రాబాద్ లో 75 రోజుల వేడుక నిర్వహించారు.

నచ్చినవారు నా సినిమా చూస్తే చాలు - సిద్ధార్థ్

సిద్ధార్థ్, వయూకామ్ 18 మోషన్ పిక్చర్స్, ఎటాకి ఎంటర్టైన్మెంట్ బేనర్స్పై సిద్ధార్థ్, ఆండ్రియూ తారాగణంగా రూపొందిన హారర్ చిత్రం ’గృహం’. మిలింద్ రావ్ దర్శకుడు.

అవార్డులు ప్ర‌క‌టించిన వారంద‌రికి అభినంద‌న‌లు తెలియ‌జేసిన 'మా' అధ్య‌క్షులు శివాజీ రాజా

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014, 15, 16 సంవత్సరాలకుగాను నంది పురస్కారాలతోపాటు ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు, బీఎన్‌ రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి, రఘుపతి వెంకయ్య అవార్డులను మంగ‌ళ‌వారం  ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.