అమరావతిలో 'జై సింహా' పాటల వేడుక ?

  • IndiaGlitz, [Friday,December 08 2017]

నటసింహ నందమూరి బాలకృష్ణ 102వ సినిమా జై సింహా'. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్.రవికుమార్ రూపొందిస్తున్న ఈ మూవీలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే ఈ సినిమా.. టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఇంకా రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ మిగిలి ఉంది. త్వ‌ర‌లోనే వాటి చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఆడియో వేడుక‌కి చిత్ర యూనిట్ ముహుర్తం కూడా ఖ‌రారు చేసింద‌ని తెలిసింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ నెల 22న‌ అమరావతిలో ఈ వేడుకను నిర్వహించనున్నార‌ని తెలిసింది. బాలయ్య కోసం మంచి మాస్ బీట్ పాటల్ని సిద్ధం చేసానని.. గతంలో ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ చెప్పారు.

మరి ఈ పాటలు శ్రోతలను ఏ మాత్రం అలరిస్తాయో చూడాలి. నయనతార, నటాషా దోషి, హరిప్రియ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి సి.కళ్యాణ్ నిర్మాత. సంక్రాంతి కానుకగా జనవరి 12న‌ ఈ మూవీని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

More News

మళ్లీ బ్రేక్ ఇస్తున్న ప్రభాస్ ?

తొలి చిత్రం ఈశ్వర్ నుంచి మిర్చి వరకు.. ప్రతి సంవత్సరం కూడా తన చిత్రాలతో సందడి చేస్తూ వచ్చారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

త్రివిక్రమ్ వారి చేతే చెప్పిస్తున్నాడు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో.. కథానాయికల పాత్రలు కేవలం వినోదం కోసం అన్నట్లుగానే ఉంటుంటాయి. ఒక్క నువ్వే నువ్వేలో మినహాయిస్తే.. ప్రతి సినిమాలోనూ ఇదే శైలి కనిపిస్తుంది. ఆయన రాసే ఆ మాటలతో కథానాయికలకు మంచి పేరే వచ్చింది కూడా.

ప్ర‌వీణ్ స‌త్తారు మ‌ల్టీస్టార‌ర్ మూవీ

'చందమామ కథలు' సినిమాతో నేషనల్ అవార్డును గెలుచుకున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. తాజాగా 'పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ప్రవీణ్. దాదాపు 10 సంవత్సరాలుగా విజయం కోసం పరితపిస్తున్న డా.

షూటింగ్ పూర్తి చేసుకున్న'ఏంసీఏ'..డిసెంబ‌ర్ 21న విడుద‌ల‌

నేచుర‌ల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్నసినిమా 'ఎం.సి.ఎ'. దిల్‌రాజు 'ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు భానుమ‌తిగా ప‌రిచ‌య‌మైన సాయిప‌ల్ల‌వి ఎం.సి.ఎలో హీరోయిన్‌గా న‌టించింది.

'అజ్ఞాత‌వాసి` సెకండ్ సింగిల్ డేట్‌, ఆడియో డేట్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూడో చిత్రంగా 'అజ్ఞాతవాసి' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటోంది.