విజ‌య్ తో న‌టించ‌డం ఓ మ‌ధుర జ్ఞాప‌కం - జ‌గ‌ప‌తి

  • IndiaGlitz, [Thursday,June 09 2016]

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ - జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్లో రూపొందుతున్నఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని భ‌ర‌త‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వెంకట్రామ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రం హైద‌రాబాద్ షెడ్యూల్ ఈరోజు ప్రారంభ‌మైంది. ఈ చిత్ర హీరో విజ‌య్, జ‌గ‌ప‌తి బాబు, ఈ చిత్ర నిర్మాత వెంక‌ట్రామ్ రెడ్డి..ఈ ముగ్గురి మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. అది ఏమిటంటే...హీరో విజ‌య్ ఫాద‌ర్ ఎస్.ఎ చంద్ర‌శేఖ‌ర్, జ‌గ‌ప‌తి ఫాద‌ర్ వి.బి.రాజేంద్ర‌ప్ర‌సాద్, వెంక‌ట్రామ్ రెడ్డి ఫాద‌ర్ బి.నాగారెడ్డి ఈ ముగ్గురు మంచి స్నేహితులు. ఇప్పుడు వాళ్ల త‌న‌యులు క‌లిసి సినిమా చేస్తుండ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా జ‌గ‌ప‌తి బాబు స్పందిస్తూ...విజ‌య్ ఫాద‌ర్, మా ఫాద‌ర్ క‌లిసి కొన్ని సినిమాలు నిర్మించారు.

ఇప్పుడు మేము క‌లిసి సినిమా చేస్తుండ‌డం.... హిస్ట‌రీ మ‌ళ్లీ రిపీట్ అవుతున్న‌ట్టు అనిపిస్తుంది. విజ‌య్ చాలా మంచి మ‌నిషి. అత‌నితో వ‌ర్క్ చేస్తూ..ఈ ప్రాజెక్ట్ లో భాగం అయినందుకు ఆనందంగా ఉంది. మా ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ వ‌ర్క్ వుట్ అయి ఆడియోన్స్ కి ఒక ఫ్రెష్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ క‌లిగిస్తుంది అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో వ‌ర్క్ చేయ‌డం థ్రిల్లింగ్ గా ఉంది. ఈ సినిమా చేయ‌డం మా నాన్న చేసుంటే ఆయ‌న కూడా చాలా థ్రిల్ ఫీల‌య్యేవారు. విజ‌య్ తో న‌టించ‌డం ఓ మ‌ధుర జ్ఞాప‌కం అన్నారు.

జ‌గ‌ప‌తిబాబు త‌మిళ చిత్రాలు తాండ‌వం, లింగా చిత్రాల్లో న‌టించారు. ఇటీవ‌ల తెలుగులో నాన్న‌కు ప్రేమ‌తో, శ్రీమంతుడు చిత్రాల్లో న‌టించారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించాయో తెలిసిందే. అలాగే జ‌గ‌ప‌తి మల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ తో క‌లిసి పులిమురుగ‌న్, మ‌రియు విశాల్ తో క‌లిసి త‌మిళ్ ఫిల్మ్ చేస్తున్నారు. క‌న్న‌డ స్టార్ సుదీప్ తో క‌లిసి బ‌చ్చ‌న్ సినిమాలో న‌టించారు. ప్ర‌స్తుతం మ‌రో రెండు క‌న్న‌డ చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఇలా సౌత్ లో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌ భాష‌ల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు జ‌గ‌ప‌తి.

More News

50 రోజులు పూర్తిచేసుకున్న స‌మ్మ‌ర్‌ బ్లాక్ బస్టర్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్‌ 'సరైనోడు'

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో, సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో, అల్లు అరవింద్ నిర్మాణంలో తెర‌కెక్కిన‌ చిత్రం సరైనోడు చిత్రం జూన్‌ 10వ తేదికి విజ‌య‌వంతంగా 50 రోజులు పూర్తిచేసుకుంటుంది.

నా లైఫ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు బాగా క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా అదే : సందీప్ కిష‌న్

స్నేహ‌గీతం, ప్ర‌స్ధానం, వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్, గుండెల్లో గోదారి, బీరువా, టైగ‌ర్, ర‌న్...ఇలా విభిన్న క‌థా చిత్రాల్లో న‌టించి యువ‌త‌లో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యంగ్ హీరో సందీప్ కిష‌న్. తాజాగా సందీప్ కిష‌న్ న‌టించిన చిత్రం ఒక్క అమ్మాయి త‌ప్ప.

పవన్ ,మహేష్ లతో సినిమా చేస్తున్న డైరెక్టర్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సూపర్ స్టార్ మహేష్...వీరిద్దరితో ఒకేసారి సినిమాలు చేసే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు ఓ డైరెక్టర్.

మిస్టర్ పై క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్..

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్నచిత్రం మిస్టర్.

జూన్ చివరి వారంలో విడుదలకి సిద్దమవుతున్న 'అంతం' ట్రైలర్

గుంటూరు టాకీస్ లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రంతో యువత హ్రుదయాల్లో పర్మినెంట్ ప్లేస్ ని సొంతం చేసుకున్న రష్మిగౌతమ్ హీరోయిన్ గా ప్రదాన పాత్రలో నటించిన చిత్రం అంతం.