'జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి' సీక్వెల్

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా, శ్రీదేవి హీరోయిన్‌గా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి’. ఈ సోషియో ఫాంట‌సీ చిత్రం విడుద‌లై మూడు ద‌శాబ్దాలైంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా నిర్మాత, వైజ‌యంతీ మూవీస్ అధినేత సి.అశ్వ‌నీద‌త్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ స్వ‌ర్గీయ ఎన్టీఆర్‌గారు న‌టించిన జ‌గ‌దేక‌వీరుడు వంటి సినిమాను తీయాలనుకున్నాను. ఈ ప్ర‌యాణంలో నా క‌ల జగ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి సినిమాతో నిజ‌మైంది. ఈ ముప్పైఏళ్లే కాదు.. మ‌రో ముప్పై ఏళ్లు మాట్లాడుకునే సినిమా ఇది’’ అన్నారు.

అశ్వనీదత్ జగదేకవీరుడు అతిలోక సుందరి రీమేక్ గురించి కూడా ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు. ‘‘క‌చ్చితంగా మా జ‌గ‌దేక‌వీరుడు మ‌ళ్లీ వ‌స్తాడు. రెండో భాగం కూడా ఉంది. ఎవ‌రు న‌టిస్తారు? ఎప్పుడు చేస్తాం? అనే వివ‌రాల‌ను త్వ‌ర‌లో తెలిజ‌యేస్తాను’’ అన్నారు. వైజయంతీ మూవీస్ అనుబంధ నిర్మాణ సంస్థ స్వప్న సినిమాస్ బ్యానర్‌లో హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా ఓ సినిమా ఉంటుంది. దీంతో పాటు నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ఉంటుంది. దీంతో పాటు మ‌రో క‌థ‌ల‌ను త‌యారు చేస్తున్నామ‌ని అశ్వ‌నీద‌త్ తెలిపారు.