షాకింగ్: వ్యభిచారం గృహంలో పట్టుబడ్డ జబర్దస్త్ నటులు

  • IndiaGlitz, [Wednesday,March 04 2020]

తెలుగు పేరుగాంచిన ప్రముఖ జబర్దస్త్‌ షోకు చెందిన ఇద్దరు నటులు వ్యభిచార గృహంలో పట్టుబడటం షాక్‌కు గురి చేస్తోంది. పూర్తి వివరాల్లోకెళితే.. ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు జబర్దస్త్ కామెడీ షోకి చెందిన దొరబాబు, పరదేశీలను పోలీసులు పట్టుకున్నారు. వీరితో పాటు ఒక మహిళ, నలుగురు విటులను పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారి మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలోని మాధవధారలో ఒక అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని.. వెంటనే టీమ్‌ను పంపి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని వెల్లడించారు. ఒక మహిళతో పాటు నలుగురు విటులను అదుపులోకి తీసుకుని పీఎస్‌లో ఉంచినట్లు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరున్నారు..? ఈ తంతు ఎప్పట్నుంచి నడుస్తోంది..? దీని వెనుక ముఠా ఏమైనా ఉందా..? అనేదానిపై పోలీసులు కూపీ లాగుతున్నట్లు సమాచారం. కాగా.. దొరబాబు, పరదేశీ ఇద్దరూ జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇలాంటి చిల్లర పనులతో పరువు పొగొట్టుకున్నారు. ఈ ఇద్దరు నటులు హైపర్ ఆది టీమ్‌లో సభ్యులుగా ఉన్నారు. ఇక నుంచి వీరిద్దరూ జబర్దస్త్‌లో కూడా కనిపించడం కష్టమనేనని తెలుస్తోంది.

More News

మహేశ్ గ్రీన్ సిగ్న‌ల్‌.. చైతు సినిమా వాయిదా!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమా స్టార్ట్ కానే లేదు కానీ..చాలా మ‌లుపుల‌ను తీసుకుంటోంది. ఎందుక‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

అనుష్క పెళ్లిపై మ‌రో వార్త‌..నిజ‌మెంత‌?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా పేరున్న అనుష్క శెట్టి పెళ్లిపై రొజుకొక వార్త విన‌ప‌డుతుంది. కొన్ని రోజుల క్రితం అనుష్క ఓ ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ను పెళ్లి చేసుకోనుంద‌ని వార్త‌లు వినిపించాయి.

మార్చి13న ‘ప్రేమపిపాసి’ రిలీజ్‌

ఎస్‌.ఎస్‌.ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌, యుగ క్రియేషన్స్‌  బ్యానర్స్‌ పై రాహుల్‌ భాయ్‌ మీడియా మరియు దుర్గశ్రీ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమ పిపాసి’

నాగీ సినిమాకు ప్రభాస్ 70 కోట్ల పారితోషికం!?

‘బాహుబలి’లాంటి భారీ సినిమాతో వరల్డ్ ఫేమస్ అయిన ప్రభాస్.. ‘మహానటి’ సినిమా తనకంటూ ఓ క్రేజ్ దక్కించుకున్న నాగ్ అశ్విన్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

యూ ట్యూబ్‌ ట్రెండింగ్‌లో ‘రాములో రాములా...’ !

టాలీవుడ్ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురంలో’