ఇక మ‌హేష్‌, సుమంత్‌, గోపీచంద్ వంతు

  • IndiaGlitz, [Wednesday,April 25 2018]

ఇటీవ‌ల కాలంలో యువ క‌థానాయ‌కుల‌ మైల్ స్టోన్ మూవీస్ బాగానే సంద‌డి చేస్తున్నాయి. రెండేళ్ళ క్రితం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన 25వ చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఈ వ‌రుస‌లోనే.. గ‌త ఏడాది శ‌ర్వానంద్ 25వ చిత్రం రాధ‌.. ఈ ఏడాది సంక్రాంతికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ 25వ చిత్రం అజ్ఞాత‌వాసి.. ఈ ఏడాది వేస‌వికి నితిన్ 25వ చిత్రం ఛ‌ల్ మోహ‌న్ రంగ విడుద‌ల‌య్యాయి.

అయితే.. ఈ చిత్రాల‌న్ని బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన విజ‌యం సాధించ‌లేకపోయాయి. ఈ నేప‌థ్యంలో రానున్న మైల్ స్టోన్ మూవీస్‌పై అంద‌రి దృష్టి ప‌డింది. ఈ లిస్ట్‌లో మ‌హేష్ 25వ చిత్రం (వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు), సుమంత్ 25వ చిత్రం సుబ్ర‌మ‌ణ్య పురం, గోపీచంద్ 25వ చిత్రం పంతం ఉన్నాయి.

మ‌రి.. ఈ మూడు చిత్రాలైనా విజ‌యం సాధిస్తాయో లేదో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ మూడు చిత్రాల‌లో ముందుగా గోపీచంద్ న‌టిస్తున్న పంతం విడుద‌ల కానుండ‌గా.. ఆ త‌రువాత సుమంత్ సుబ్ర‌మ‌ణ్య‌పురం ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ కానుంది. ఇక మ‌హేష్ 25వ చిత్రం వ‌చ్చే ఏడాది ఆరంభంలో సంద‌డి చేయ‌నుంది.

More News

నెల రోజుల గ్యాప్‌లో మూడు సినిమాలు

శ‌ర‌త్ కుమార్‌.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని విల‌క్ష‌ణ న‌టుడి పేరిది. భాష ఏదైనా త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ట్టుకుంటారు ఈ వెర్స‌టైల్ ఆర్టిస్ట్‌.

అప్పుడు కృష్ణ‌, ఇ.వి.వి- ఇప్పుడు మ‌హేష్‌, అల్లరి న‌రేష్‌

కొన్ని కొన్ని విష‌యాలు యాదృచ్ఛికంగా జ‌రిగినా విన‌డానికి ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. అలాంటి ఓ విష‌య‌మే కృష్ణ‌, మ‌హేష్ బాబు విష‌యంలో చోటు చేసుకోనుంది.

బాల‌య్యతో వ‌ర్క‌వుట్ కాలేదు.. మ‌రి సుధీర్ బాబుకి?

వైవిధ్య‌మైన చిత్రాల‌కు చిరునామాగా నిలిచిన నిర్మాణ సంస్థ‌ల్లో శ్రీ‌దేవి మూవీస్ ఒక‌టి. ఆదిత్య 369, వంశానికొక్క‌డు వంటి విజ‌యంత‌మైన చిత్రాల‌ను నిర్మించిన ఈ సంస్థ అధినేత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్‌..

క‌ల్యాణ్ రామ్ హీరోగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్, నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా

వారం గ్యాప్‌లో రెండు సోల్జ‌ర్ చిత్రాలు

దేశం కోసం ప్రాణత్యాగం చేయ‌డానికి కూడా వెనుకాడ‌ని ఆర్మీ ఆఫీస‌ర్ల క‌థ‌ల‌తో గ‌తంలో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి.