ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పొడగింపు...

  • IndiaGlitz, [Wednesday,December 30 2020]

వ్యక్తిగత ఐటీ రిటర్న్‌ల దాఖలుకు సంబంధించిన గడువును మరోసారి కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం పన్ను రిటర్న్‌ల (ఐటీఆర్) గడువును డిసెంబర్ 31 నుంచి 2021 జనవరి 10వ తేదీ వరకూ పొడిగించింది. అలాగే కంపెనీల ఐటీ రిటర్న్‌ల దాఖలు గడువును 15 రోజుల పాటు పెంచింది. ఫిబ్రవరి 15 లోపు రిటర్నులు దాఖలు చేసుకునే వీలును కల్పించింది. కరోనా మహమ్మారి కారణంగా పన్ను చెల్లింపు దారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది.

కాగా.. అకౌంట్ల ఆడిట్‌ అవసరం లేని, సహజంగా ఐటీర్-1, ఐటీఆర్-4 ఫార్మ్స్ ద్వారా రిటర్న్‌లు దాఖలు చేసే వారికి ఈ పొడిగింపు వర్తిస్తుందని బుధవారం ఆదాయం పన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా.. పన్ను చెల్లింపుదారులకు ఐటీ రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ 31 గానూ.. కంపెనీలకు జనవరి 31 గానూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. అలాగే, జీఎస్‌టీ కింద 2020 ఆర్థిక సంవత్సరం కింద వార్షిక రిటర్న్‌ల దాఖలు గడువును కూడా 2021 ఫిబ్రవరి 28 వరకూ పొడిగించారు. కాగా.. ఈ ఏడాది డిసెంబర్ 28 వరకూ 4.54 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించింది.

More News

మీ ప్రయాణం స్ఫూర్తిదాయకం: సోనూపై మెగాస్టార్ ప్రశంసలు

కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ విధించిన సమయంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ బయటకు వచ్చేందుకు ఎవరూ సాహసించలేదు.

అజారుద్దీన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్‌ బుధవారం ఉదయం కారు ప్రమాదానికి గురయ్యారు.

కొత్త సంవత్సరం రోజున రాధేశ్యామ్ టీజర్.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

రెబల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా?

చెర్రీ ఆరోగ్యంపై ఉపాసన ట్వీట్..

మెగా ఫ్యామిలీని కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. ఒకేరోజు మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

మార్పు.. యూటర్న్‌లు.. న్యూ ఇయర్‌లో కేసీఆర్ 2.0..

2020 ఎండింగ్ తెలంగాణ సీఎం కేసీఆర్‌లో ఊహించని మార్పు తీసుకొచ్చింది. ఆ మార్పు ఎందుకు..? ఏమిటి? అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.