సినీ ఇండ‌స్ట్రీ పై ఐటీ దాడులు.. ఎంత డ‌బ్బు ప‌ట్టుకున్నారో తెలుసా!

  • IndiaGlitz, [Friday,February 07 2020]

సినీ ఇండ‌స్ట్రీపై ఐటీ శాఖ దాడులు చేసిందా? అదేంటి? అదెప్పుడు అనే సందేహాలు రాక మాన‌వు. నిజానికి ఐటీ శాఖ దాడులు చేసింది టాలీవుడ్‌లో కాదు.. కోలీవుడ్‌లో. రెండు రోజుల నుండి ఇన్‌క‌మ్ ట్యాక్స్ అధికారులు ఓ ప్ర‌ముఖ త‌మిళ నిర్మాత‌, హీరోలు సంబంధిత ఫైనాన్సియ‌ర్, వ్య‌క్తుల‌పై దాడులు చేశారు. గురువారంనాడు ప్ర‌ముఖ ఫైనాన్సియ‌ర్ ఇళ్ల‌పై దాడులు చేసిన ఐటీ శాఖ దాదాపు రూ.300 కోట్ల రూపాయ‌ల న‌ల్ల‌ధనాన్ని ప‌ట్టుకున్న‌ట్లు తెలిపారు. బుధ‌వారం రోజున బిగిల్ సినిమా నిర్మాణ సంస్థ ఎజీఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, హీరో విజ‌య్‌ను ఐటీ అధికారులు గ‌ట్టిగా ప్ర‌శ్నించారు. త‌ర్వాత ఫైనాన్సియ‌ర్ అన్బు సెల్వ‌న్ ఇళ్లు, ఆఫీసుల‌పై కూడా ఐటీ దాడులు జ‌రిగాయి.

అన్బు చెలియన్ మ‌ధురై ఆఫీసుల్లో ఐటీ దాడుల్లోషాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. 38 ప్రాంతాల్లో అధికారులు దాడులు చేసిన‌ప్పుడు రూ.77 కోట్ల మేర‌కు న‌ల్ల‌ధ‌నాన్ని ప‌ట్టుకున్నారు. పెద్ద మొత్తంలో ప్రాప‌ర్టీ డాక్యుమెంట్స్‌, ప్రామిస‌రీ నోట్స్‌, పోస్ట్ డేటెడ్ చెక్స్‌, ఆస్థుల ప‌త్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దాడులపై హీరో విజ‌య్ అభిమానులు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. రాజ‌కీయ కోణంలోనే విజ‌య్‌పై దాడులు జరిగాయ‌ని వారు సోష‌ల్ మీడియాలో త‌మ నిర‌స‌న‌ల‌ను వ్య‌క్తం చేశారు. మ‌రి దీనిపై హీరో విజ‌య్ మాత్రం ఎక్క‌డా స్పందించ‌లేదు.

More News

ప్ర‌భాస్ సినిమాలో మ‌రో హీరోయిన్.. ఎగిరి గంతేస్తున్న యంగ్ బ్యూటీ

బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.

టీడీపీలో చీలిక రాబోతోంది: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీలో త్వరలో చీలిక రాబోతుందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పరిశ్రమలు తరలిపోతుంటే ఉపాధి ఎలా? : పవన్

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం ‘కియా మోటార్స్‌’ ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరలిపోతుందంటూ సోషల్ మీడియాలో..

లోకేశ్‌కు షాకిచ్చిన జగన్ సర్కార్

టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌కు జగన్ సర్కారు షాకిచ్చింది. ఇప్పటి వరకూ లోకేశ్‌కు ఉన్న ‘వై’ కేటగిరీ భద్రతను తగ్గించింది.

హాజీపూర్ హత్యల కేసు: శ్రీనివాస్‌కు ఉరి శిక్ష

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన.. ఊహించుకోవడానికే భయపడేలా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం హాజీపూర్‌లో శ్రీనివాసరెడ్డి వరుస అత్యాచార ఘటనలకు పాల్పడిన సంగతి తెలిసిందే.