MP Ponguleti:చెప్పినట్లే జరిగింది.. మాజీ ఎంపీ పొంగులేటి ఇంటిపై ఐటీ దాడులు..

  • IndiaGlitz, [Thursday,November 09 2023]

ఓవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతుండగా.. మరోవైపు కాంగ్రెస్ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, కేఎల్‌ఆర్, పారిజాత నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇళ్లల్లో సోదాలు చేసిన అధికారులు తాజాగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇవాళ ఉదయం ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఖమ్మంలోని ఆయన నివాసంతో పాటు పాలేరులోని క్యాంపు కార్యాలయంలో ఐటి, ఈడీ అధికారుల‌ు తనిఖీలు చేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు ఎనిమిది వాహనాలలో అధికారులు వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఐటీ అధికారుల దాడుల గురించి బుధవారమే పొంగులేటి కామెంట్స్ చేశారు. తనపైనా, తన కుటుంబంపైనా ఐటీ సోదాలకు ఆస్కారం ఉందని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కై తనపై ఐటీ దాడులు చేయించాలని చూస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలకు ఇలాంటి ఇబ్బందులు కొన్ని రోజులు తప్పవని వ్యాఖ్యానించారు. ఆయన అలా చెప్పిన మరుసటి రోజే ఐటీ దాడులు జరగటం కలకలం రేపుతోంది. ఎన్నికల్లో ప్రజలు తమ వైపు ఉన్నారని.. తమను ఎలాగైనా ఇబ్బందులు పెట్టాలని అధికార బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఐటీ దాడులు చేయిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పాలేరు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ తరపున పొంగులేటి బరిలోకి దిగుతున్నారు. ఇవాళ ఆయన తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ లోపే ఐటీ దాడులు జరగటం పట్ల ఆయన అభిమానులు, శ్రేణులు మండిపడుతున్నారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఫైర్ అవుతున్నారు. మొత్తానికి ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలపై ఐటీ సోదాలు నేపథ్యంలో ప్రచారం మరింత రసవత్తరంగా జరగనుంది.

More News

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ మద్దతు కోరిన లండన్ మేయర్ అభ్యర్థి

లండన్‌ మేయర్‌ ఎన్నికల బరిలో ఉన్న భారత సంతతికి చెందిన అభ్యర్థి తరుణ్ గులాటీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు.

Sudheer:త్వరలోనే ‘కాలింగ్ సహస్త్ర’తో థియేటర్స్‌లో సందడి చేస్తాం - హీరో సుధీర్

బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించి తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నారు.

Bandla Ganesh:తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభంజనం మొదలైంది.. అందరి నోట కాంగ్రెస్ మాటే: బండ్ల గణేష్

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు రెడీ అయ్యారని సినీ నిర్మాత బండ్ల గణేష్‌ తెలిపారు.

Prime Minister Modi:బిహార్ సీఎం నితీశ్ కుమార్ 'సెక్స్' వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆగ్రహం

జనాభా నియంత్రణ విషయంలో మహిళలపై బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.

Vande Sadharan Express:‘వందే సాధారణ్‌ ఎక్స్‌ప్రెస్‌’ ట్రయల్ రైన్ సక్సెస్.. త్వరలోనే ప్రయాణికులకు అంబాటులోకి..

భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం పడబోతుంది. సాధారణ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ తీసుకొస్తు్న్న ‘వందే సాధారణ్‌ ఎక్స్‌ప్రెస్‌’ (Vande Sadharan express)