బాహుబ‌లి నిర్మాతల‌ ఇళ్లు, ఆఫీస్ ల‌ పై ఐటి దాడులు..!

  • IndiaGlitz, [Friday,November 11 2016]

500, 1000 నోట్ల ర‌ద్దుతో టాలీవుడ్ కి ఓ షాక్ త‌గిలితే...ఇప్పుడు బాహుబ‌లి ప్రొడ్యూస‌ర్స్ పై ఐటి దాడుల‌తో మ‌రో షాక్ త‌గిలింది. ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం బాహుబ‌లి. ఈ చిత్రం 150 కోట్ల బ‌డ్జెట్ తో రూపొంది దాదాపు 600 కోట్ల వ‌సూలు చేసింది. ఈ భారీ చిత్రాన్ని రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించారు.

ఈరోజు బాహుబ‌లి నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని ఇళ్లు, ఆఫీస్ ల పై ఐ.టి సోదాలు చేస్తున్నారు. మోడీ సంచ‌ల‌న నిర్ణ‌యంతో ఓ వైపు షూటింగ్ లు ఆగిపోయాయి. మ‌రో వైపు కొన్ని సినిమాల విడుద‌ల వాయిదా ప‌డ్డాయి. ఇక త‌ప్ప‌క విడుద‌ల చేసిన సినిమాల‌కు జ‌నం ద‌గ్గ‌ర డ‌బ్బ‌లు లేక‌పోవ‌డంతో క‌లెక్ష‌న్స్ లేక థియేట‌ర్స్ అన్నీ ఖాళీగా ఉంటున్నాయి. ఇలా టాలీవుడ్ క‌ష్ట‌కాలంలో ఉంది అనుకుంటున్న‌త‌రుణంలో ఐటి దాడులతో మ‌రింత టెన్ష‌న్ పెరిగింది. రెండు మూడు రోజుల్లో మ‌రిన్ని భారీ నిర్మాణ సంస్థ‌ల పై దాడులు చేసేందుకు ఐటి శాఖ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది...!