విజయ్ , నయన్ , సమంత ఇళ్లపై దాడి..

  • IndiaGlitz, [Wednesday,September 30 2015]

త‌మిళ హీరో విజ‌య్, హీరోయిన్స్ న‌య‌న‌తార‌, స‌మంత ఇళ్ల పై దాడి చేసింది ఎవ‌రో కాదు ఇన్ క‌మ్ టాక్స్ అధికారులు. ఈ రోజు ఉద‌యం నుంచి ఈ దాడులు ప్రారంభ‌మ‌య్యాయి. సాయంత్రం వ‌ర‌కు కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. చెన్నైలోని వారి ఇళ్ల‌లో అధికారులు సోదాలు చేస్తున్నారు.

స‌మంత‌, న‌య‌న‌తార వీరిద్ద‌రు సౌతిండియాలో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ..ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమాల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ లో కూడా న‌టిస్తున్నారు. దీంతో బ్లాక్ మ‌నీ ఉండ‌వ‌చ్చు అనే అనుమానంతో ఐటి అధికారులు ఈ దాడులు చేసిన‌ట్టు తెలుస్తోంది. చెన్నైలోనే కాకుండా మ‌ధురై, తిరువ‌నంత‌పురం లోని నివాసాల్లో కూడా దాడులు జ‌రుగుతున్నాయి.అయితే విజ‌య్, న‌య‌న‌తార‌, స‌మంత ఇళ్ళ నుంచి ఏమైనా బ్లాక్ మ‌నీ ల‌భించిందా లేదా..? అనేది ఈ త‌నీఖీలు పూర్త‌యితే తెలుస్తాయి.

More News

లోఫ‌ర్ కొత్త టైటిల్ ఏమిటి..?

నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం లోఫ‌ర్. ఈ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్నారు.

వర్మ వీరప్పన్ రిలీజ్ ఎప్పుడు...?

వివాదాలకు మరో పేరైన వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కిల్లింగ్ వీరప్పన్.రెండు రాష్ట్ర ప్రభుత్వాలను వణికించిన వీరప్పన్ ను చంపిన పోలీసాఫీసర్ కథతో వర్మ కిల్లింగ్ వీరప్పన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

బుల్లితెర పై 'బాహుబలి' ఎప్పుడు..?

ప్రభాస్,రానా,అనుష్క ప్రధాన తారాగణంగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి.ఈ చిత్రం స్రుష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

సర్ధార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ ఎవరు...?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ.

బన్ని...భారీ ప్లాన్ ఏమిటి...?

బన్ని,బోయ పాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం సరైనోడు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.