మూడేళ్లుగా దాచిన రహస్యాన్ని బయటపెట్టిన ఇస్రో శాస్త్రవేత్త..

  • IndiaGlitz, [Wednesday,January 06 2021]

భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త తపన్ మిశ్రా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. మూడేళ్లుగా దాచి ఉంచిన రహస్యాన్ని తాజాగా ఆయన బట్టబయలు చేశారు. ‘ఎంతో కాలంగా దాచి ఉంచిన రహస్యం’ పేరిట తపన్ మిశ్రా పెట్టిన ఫేస్‌బుక్ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది. ఇస్రోలో సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తున్న తపన్ మిశ్రా.. ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ సమయంలో తనపై విష ప్రయోగం జరిగిందని చెప్పి ఒక్కసారిగా సంచలనం రేపారు.

2017 జులైలో ఈ ఘటన జరిగిందని తపన్ మిశ్రా వెల్లడించారు. ఆ రోజున తాను దోశ తిన్నానని.. దాంతో పాటు ఇచ్చిన చట్నీలో రసాయనిక ప్రయోగం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అది తిన్న అనంతరం తాను అనారోగ్యం పాలయ్యాయని, ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడ్డానని తపన్ తెలిపారు. చర్మంపై ర్యాషెస్ రావడంతో పాటూ అరచేతిపై చర్మం అంతా ఊడిపోయిందన్నారు. తనపై జరిగిన విష ప్రయోగానికి సంబంధించిన రిపోర్టును కూడా తపన్ మిశ్రా ఫేస్‌బుక్ పోస్టులో జత చేశారు.

తపన్ మిశ్రాపై ఆర్సెనిక్‌ అనే రసాయన ప్రయోగం జరిగినట్టు ఎయిమ్స్ రిపోర్టులో తేలింది. ఈ రిపోర్టును తన పోస్టుకు జత చేసిన తపన్ మిశ్రా.. గూఢచర్య ఆపరేషన్‌లో భాగంగానే ఇది జరిగిందని వెల్లడించారు. మిలిటరీ, వ్యాపార రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఓ శాస్త్రవేత్తను తొలగించడమే ఈ దాడి వెనుక కారణం అయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు జరపాలని కూడా తపన్ మిశ్రా కోరారు.

More News

‘ఆచార్య’ సెట్‌లో ఆకట్టుకున్న సోనూసూద్.. 100 మందికి..

‘ఆచార్య’ షూటింగ్‌ సెట్‌లో ప్రముఖ నటుడు సోనూసూద్ ఆకట్టుకున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు..

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్..

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఆమెతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్‌ కూడా అరెస్ట్ అయ్యారు.

కర్ణాటక సీఎంకు రూ. 25 వేల జరిమానా..

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మైకేల్ డి.కున్హా రూ.25 వేల జరిమానా విధించారు.

డేట్ ఫిక్స్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి...!

టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒక‌రైన విజ‌య్ దేవ‌ర‌కొండ.. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఛాలెంజింగ్ రోల్‌లో హెబ్బా ప‌టేల్‌..!

‘కుమారి 21 ఎఫ్‌’ సూప‌ర్‌హిట్ కావ‌డంలో త‌న‌దైన పాత్ర‌ను పోషించిన హీరోయిన్ హెబ్బా ప‌టేల్‌..