Sharmila:ఇదేనా మీ పాలన.. సీఎం జగన్‌కు ఏపీసీసీ చీఫ్‌ షర్మిల ఘాటు లేఖ

  • IndiaGlitz, [Saturday,April 27 2024]

ఏపీ ఎన్నికల వేళ సీఎం వైఎస్ జగన్‌కు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. మీ పాలనలో రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల జీవన ప్రమాణాలు అత్యంత దారుణంగా ఉన్నాయని విమర్శించారు. ఓసారి ఆ లేఖ సారాంశం పరిశీలిస్తే..

‘ఘనత వహించిన మీ ఏలుబడిలో బడుగు బలహీనవర్గాల బతుకులు దయనీయంగా మారాయి. జీవన ప్రమాణాలు కూడా అధ్వానంగా ఉన్నాయి. వారికి రాజ్యాంగపరంగా దక్కాల్సిన హక్కులకు కూడా దిక్కులేని పరిస్థితి మీ పాలనలో ఎదురవుతోంది. నిధులు దారి మళ్లించి బడ్జెట్ పరంగా 'ఉప ప్రణాళిక'ని మంట గలిపారు. మీరొచ్చేదాకా కొనసాగుతున్న 28 పథకాలు, కార్యక్రమాలను నిర్దయగా, నిర్లక్ష్యంగా నిలిపివేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో దళితులు, ఆదివాసీలు, గిరిజనులపై దాడులు జరుగుతున్నా.. దాష్టీకాలు పెరుగుతున్నా పట్టనట్లే ఉన్నారు. వాటిని నివారించి వారిని కాపాడే నిర్దిష్ట చర్యలు లేవు. ప్రధానంగా వారికి రక్షణ లేదు. పైగా, ఇలా దాడులు దౌర్జన్యాలకు తెగబడుతున్న వారిలో ఎక్కువమంది మీ పార్టీకి చెందిన పెత్తందార్లు, మోతుబర్లు, రౌడీ మూకలే! ఉన్నారు.

‘ఎక్కడ అవకాశం దొరికినా.. వేదికెక్కి ప్రసంగించినా 'నా ఎస్సీలు, నా ఎస్టీలు' అంటూనే వారిని వంచించారు. మేలు చేయకపోగా కీడు చేస్తున్నారు. దళితులపై చేసిన దాష్టీకాలకు, నేడు కోర్టులో శిక్షపడ్డా ఆయనను అందలం ఎక్కించాలని సిగ్గు, సంస్కారం వదిలేసినా మీ నాయకత్వానికే చెల్లుతుంది. ఇప్పుడు కూడా మీ పార్టీలోని దళిత నాయకులు, ఏరుదాటి తెప్పతగలేసే మీ బరితెగించిన వాలకాన్ని తట్టుకోలేక ఎలా బయటకు వస్తున్నారో వేరే చెప్పాలా ముఖ్యమంత్రిగారు!’

‘పేదలు పెత్తందార్లకు మధ్య క్లాస్ వార్’ అంటూనే కడు పేదలైన ఎస్సీ ఎస్టీలు కోలుకోలేని విధంగా మీరు దెబ్బతీశారు. ఇంత అన్యాయమా? అన్ని విధాలా అన్యాయానికి గురవుతున్న ఎస్సీ ఎస్టీలకు సత్వరం విముక్తి కలిగించండి! ‘కన్న తల్లే దయ్యమైతే తొట్టెల కట్టే స్థలం లేదన్న’ సామెత చందంగా.. ప్రభుత్వమే పగబట్టినట్టుండటం.. దళిత గిరిజన వర్గాల వంచనకు నిలువెత్తు నిదర్శనం. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జరిగిన అన్యాయానికి క్షమాపణలు కోరండి. ఇకపై ఏ వివక్షా లేకుండా, తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మాటివ్వండి. వారి అభ్యున్నతికి అవసరమైన అన్ని చర్యల్ని తక్షణం చేపట్టండి. బాధ్యత కలిగిన రాజకీయ పక్షంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఇదే మా డిమాండ్!’ అంటూ లేఖలో వెల్లడించారు.

More News

Ramayanam:'రామాయణం' మూవీ నుంచి రణ్‌బీర్‌, సాయిపల్లవి స్టిల్స్ లీక్

'యానిమల్' సినిమాలో వైల్డ్ పాత్రలో నటించిన మెప్పించిన బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్(RanbirKapoor) ఇప్పుడు దేవుడి పాత్రలోకి మారిపోయాడు.

KCR:ట్విట్టర్‌(ఎక్స్)లోకి కేసీఆర్ ఎంట్రీ.. తొలి ట్వీట్ ఏంటంటే..?

ప్రస్తుతం డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఎంతటి ప్రభావం చూపుతుందో అందరికి తెలిసిందే. ప్రతి చిన్న విషయం సోషల్ మీడియా

BRS:బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. కేసీఆర్‌కు చావో రేవో పరిస్థితి..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీని 2001, ఏప్రిల్ 27న కేసీఆర్ ప్రారంభించారు.

YCP Manifesto:వైసీపీ మేనిఫెస్టో విడుదల.. అమ్మఒడి పెంపు..

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ మేనిఫెస్టోను విడుదలచేశారు.

Pensions in AP: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

ఏపీ ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. వృద్ధులకు పింఛన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు.