ఈ టైటిల్ చైతు కోస‌మేనా..?

  • IndiaGlitz, [Tuesday,September 13 2016]

'సాహసం శ్వాస‌గా సాగిపో', 'ప్రేమమ్' చిత్రాలు త‌ర్వాత అక్కినేని నాగ‌చైత‌న్య చేయ‌నున్న సినిమా కల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంది. ఈ విష‌యాన్ని అక్కినేని నాగార్జున తెలియ‌జేశారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రం నిన్నే పెళ్ళాడ‌తా స్టైల్లో ఉంటుంద‌ని కూడా నాగార్జున తెలియ‌జేశారు. ఈ సినిమాకు ముందు క‌ల్యాణ్యం అనే టైటిల్ విన‌ప‌డింది.

రీసెంట్‌గా ఈ సినిమాకు నిన్నేపెళ్ళాడ‌తా అనే టైటిల్ పెట్టిన‌ట్టు వార్త‌లు వినప‌డ్డాయి. అయితే ఇప్పుడు ఈ రెండు టైటిల్స్ చైత‌న్య సినిమాకు పెట్టేలా లేదు. ఎందుకంటే తాజాగా అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై 'ఒక‌సారి ఇటు చూడ‌వే' అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించారు. ఇదే టైటిల్ నాగ‌చైత‌న్య సినిమాకు ఖ‌రార‌య్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌న‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ విష‌యంపై నాగ్ అండ్ టీం ఎలా స్పందిస్తారో చూడాలి.

More News

ఆ ఆలోచ‌న నుంచి పుట్టికొచ్చిందే సిద్దార్ధ - సాగ‌ర్

మొగ‌లిరేకులు సీరియ‌ల్ తో బాగా పాపుల‌ర్ అయిన సాగ‌ర్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం సిద్దార్ధ‌. ఈ చిత్రాన్ని ద‌యానంద్ రెడ్డి తెర‌కెక్కించారు.

ప‌వ‌న్ కొత్త పుస్త‌కం నేను- మ‌నం - జ‌నం..!

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పార్టీ సిద్దాంతాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు ఓ పుస్త‌కం రాస్తున్నారు. ఈ పుస్త‌కం పేరు నేను - మ‌నం - జ‌నం (మార్పు కోసం యుద్ధం).

అక్టోబర్‌ 7న సునీల్‌ ఈడు గోల్డ్‌ ఎహే

డాన్సింగ్‌ స్టార్‌ సునీల్‌, బిందాస్‌, రగడ, దూసుకెళ్తా  చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఈడు గోల్డ్ ఎహే.ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

క‌ళ్యాణ్ రామ్, పూరి చేతుల మీదుగా అర‌కు రోడ్ లో ఆడియో విడుద‌ల‌

రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్ జంట‌గా శేషాద్రి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `అర‌కు రోడ్ లో`. వాసుదేవ్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రానికి మేకా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, బి.భాస్క‌ర్‌, వేగిరాజు ప్ర‌సాద రాజు, రామేశ్వ‌రి న‌క్కా లు నిర్మాతలు. రాహుల్ రాజ్, వాసుదేవ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాట‌ల‌ను సోమ‌వారం హైద‌రాబాద్‌లోని

రాంచ‌ర‌ణ్‌తో మ‌ణిర‌త్నం...?

మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ హీరోగా ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందనుంద‌ని గ‌తంలో వార్త‌లు వినిపించాయి. ఓకే బంగారం చిత్ర క‌థ‌నే మ‌ణిర‌త్నం రాంచ‌ర‌ణ్‌కు వినిపించాడ‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి.